తన వ్యవహార శైలి సరైంది కాదంటూ సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన వేళ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తక్షణమే ఏం స్పందించలేదు. కేవలం పబ్లిసిటీ కోసం పాకులాడే స్వామీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ మోదీ రెండు రోజుల క్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తనకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తే తన గురించి మాట్లాడటంతో స్వామి తట్టుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామి తన ట్విట్టర్లో చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. "రాజకీయ నాయకులారా... కొత్త సమస్య: ఓ రాజకీయ నాయకుడు పబ్లిసిటీ కావాలని అనుకుంటే, 30 ఓవీలు ఇంటి బయట ఉంటాయి. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి 200 మిస్డ్ కాల్స్ వస్తాయి" అని ట్వీటాడు. అయితే సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన దృష్టిలో మంచి వ్యక్తిగా, ఓ వక్తగా, సీనియర్ నేతగా మార్క్ ఉన్నప్పటికీ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు రావటంతోనే స్వామి వ్యవహారంలో మోదీ స్పందించాల్సి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై తనకు మద్ధతు పలకకుండా సైలెంట్ గా ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీతో సహా నేతలంతా ముప్పేట దాడి జరుగుతుండటంతో నిస్పృహకు లోనైన ఆయన సెటైర్లకు దిగారు. తనకు ఆత్మీయుడిగా పేరుబడ్డ ప్రధానిపైనే తాజా ట్వీట్లతో విమర్శలకు దిగారని తెలుస్తోంది. పనిలో పనిగా భగవద్గీతలోని శ్లోకాలను వల్లిస్తూ చివర్లో కాస్త వేదాంతాన్ని వల్లవేశారు కూడా.
భాస్కర్
PTs : New problem: when publicity relentlessly seeks a politician. 30 OVs outside the house, 200 missed calls from channels and paparazzis ?
— Subramanian Swamy (@Swamy39) June 29, 2016
The world is in general equilibrium. A small change in one parameter effects changes in all variables. So Krishna advised: Sukh Dukhe....
— Subramanian Swamy (@Swamy39) June 28, 2016
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more