Two Terrorists killed in encounter with security forces in J&K జమ్మూలోని బరాముల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Two terrorist killed in encounter with security forces in j k s pulwama

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Baramullah encounter, Agniveer recruitment camp, Yedipora encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, Baramullah encounter JK, Jammy encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, JeM terrorists killed, Jammu and Kashmir, National politics

An encounter has broken out between terrorists and security forces at Yedipora area in South Kashmir's Baramullah district of Jammu and Kashmir, police informed on Friday (September 30). Two terrorist has also been killed by the security forces in Yedipora.

జమ్మూలోని బరాముల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Posted: 09/30/2022 05:24 PM IST
Two terrorist killed in encounter with security forces in j k s pulwama

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోగల బారాముల్లా జిల్లాలోని ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత బలగాలు ఉగ్రవాదులను హతమార్చాయి. వుల్వామా జిల్లాలోని యెడిపోరాలో ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

కాగా ఈ యేడిపోరాలో ప్రాంతంలో ఇప్పటికీ ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. బారముల్లా జిల్లాలోని యేడిపోరాలో అగ్నిపాత్ పథకం కింద ఇటీవల అహ్వానించిన ధరఖాస్తుల ఎంపిక కొనసాగుతోంది. కాగా, అభ్యర్థులను అగ్నివీర్ కింద రిక్రూట్ మెంట్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపాలరి పథక రచన చేశారు. అయితే వాటిని భారత భద్రతా బలగాలు తమ కార్డన్ సర్చ్ తో భగ్నం చేశారు. ఈ క్రమంలో బారాముల్లా జిల్లాలోని యోడిపోరా పట్టణ ప్రాంతంలో ఇవాళ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు.

బారాముల్లా జిల్లాలోని యెడిపోరా, పట్టణ ప్రాంతంలో ఇవాళ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. షోపియాన్‌లోని చిత్రగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, పోలీసులు.. భద్రతా దళాలు పనిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల గురించి అందిన పక్కాగా అందించిన సమాచారం మేరకు.. పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles