దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అల్పపీడనం మరింత బలపడేందుకు దోహదపడతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా మారుతుందని.. ఇక ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి మంగళవారం అనగా మే10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇది బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు.
ఇక ఒడిశాలో తుఫాను తీరం దాటుందన్న వార్తలతో రాష్ట్రయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తుపాను వల్ల ఒడిశాలోని 18 రాష్ట్రాలపై తీవ్రప్రభావం చూపనుందని ఐఎండీ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు పూనుకుంది. ముందుజాగ్రత్త చర్యగా మల్కన్గిరి నుంచి మయూర్భంజ్ వరకు ఒడిశాలోని 18 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా అదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంతో పాటు అందుకుముందు కురిసే వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత 18 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని అదేశించారు.
తుపాను నేపథ్యంలో అవసరమైతే 17 ఎన్డీఆర్ఎఫ్, 20 ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అగ్నిమాపక సేవల విభాగానికి చెందిన 175 బృందాలు అత్యవసరమైన పరిస్థితులలో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయని జెనా పేర్కోన్నారు. ఇక అసాని తుపాను నేపథ్యంలో పూరి గుడిసెలు, కచ్చ ఇళ్లలోని నివసించే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రణాళికను జిల్లా కలెక్టర్లు సిద్ధం చేయాలని జెనా కోరారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు పిల్లలను.. జియో-ట్యాగ్ చేయబడిన పునరావాస కేంద్రాలకు తరలించేందాలని అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more