ముంబైలోని శక్తి మిల్స్ ప్రాంతానికి ఫోటో షూట్ కోసం ఓ వ్యక్తితో కలిసి వెళ్లిన 22 ఏండ్ల ఫోటో జర్నలిస్ట్ పై 2013లో సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు దోషులకు ముంబైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్ష విషయంలో ఇవాళ బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అయితే కిందికోర్టు విధించిన మరణ శిక్షకు విధించేందుకు వీరు ఏ మాత్రం తక్కువ నేరం చేయాలేదని పేర్కోన్న బాంబే హైకోర్టు గురువారం వీరికి ఆమరణ జైలు శిక్షను విధించింది.
ప్రజాగ్రహం ఆధారంగా తీర్పును వెలువరించలేమని స్పష్టం చేసిన బాంబే హైకోర్టు.. శక్తి మిల్స్ సామూహిక లైంగిక దాడి కేసు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. లైంగిక దాడి బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర వేదన అనుభవించిందని, ఇది మానవ హక్కులపై దాడి అని కోర్టు పేర్కొంది. అయితే కేవలం ప్రజాగ్రహం తీర్పు ను ప్రభావితం చేయరాదని వ్యాఖ్యానించింది. కాగా అదే రోజున ఉదయం ఇదే నిందితులు మరో 19 ఏళ్ల యువతిపై కూడా అత్యాచారం చేశారన్న అభియోగాలు కూడా నమోదు కావడంతో వీరిని వరుస దారుణాలకు పాల్పడుతున్న నిందితులుగా పరిగణించిన ప్రిన్సిఫల్ సెషన్స్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది.
ఈ తీర్పును అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు అనుమతిని కోరుతూ పిటీషన్ దాఖాలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం నిందితులకు విధించిన మరణశిక్షను అమరణ జీవితఖైదు శిక్షగా మార్చింది. అయితే వీరు మరణశిక్షకు తక్కువ నేరాన్ని చేయలదేని పేర్కోన న్యాయస్థానం ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని శిక్షను విధించలేమని చెప్పింది. ఈ కేసులోని ముగ్గురు దోషులు.. తమ మిగిలిన జీవితమంతా జైలులో గడపాలని, ఈ క్రమంలో వారికి పెరోల్ జారీ చేయరాదని వారికి యావజ్జీవ ఖైదు విధించింది.
2013లో ఓ వ్యక్తితో కలిసి శక్తి మిల్స్కు ఫోటో షూట్ కోసం యువతి వెళ్లగా అతడిని చెట్టుకు కట్టేసిన అయిదుగురు నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మరో సామూహిక లైంగిక దాడి కేసులోనూ దోషులుగా తేలడం గమనార్హం. బాధితురాలిపై విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం బెంగాలి, మహ్మద్ సలీం అన్సారీ, సిరాజ్ రెహ్మీన్ ఖాన్, ఆకాష్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిలో ఆకాష్ నేరం జరిగిన సమయంలో మైనర్ కాగా 2014 మార్చిలో జాదవ్, బెంగాలీ, అన్సారీలకు ముంబై సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఖాన్కు యావజ్జీవ ఖైదు విధించిన కోర్టు జువైనల్ జస్టిస్ బోర్డు దోషిగా నిర్ధారించిన మీదట ఆకాష్ ను దిద్దుబాటు కేంద్రానికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more