వివాహబంధం అన్నది కాంట్రాక్టు కాదని, అది ఒక పవిత్ర బంధమని నేటి తరం తెలుసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో అహం, ఆధిపత్యం అన్నవి వారి మధ్యలో రాకూడదని, అవి చెప్పులు మాదిరిగా ఇంటి బయటే వదిలేయాల్సిన అవసరం వుందని తెలిపింది. అలా కాని పక్షంలో వారి సంతానం ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని అన్నారు. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని తలపాగా తీసినంత తేలిగ్గా తెంచుకోరాదని పేర్కోంది. అయితే, సహ జీవనానికి హక్కు కల్పించిన గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ‘పవిత్రత’ అన్న పదానికి అర్థం లేకుండాపోయిందని అన్నారు.
ఈ నేపథ్యంలో గృహ హింస చట్టంపై కూడా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి వారిలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2015లో శశికుమార్ పై అతడి భార్య సేలంలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు మహిళా కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందని ఫస్ట్ అడిషనల్ సబ్ జడ్జికి శశికుమార్ ఫిర్యాదు చేశారు.
విడాకులు రావడానికి నాలుగు రోజుల ముందు యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్ కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో ఆయన శశికుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2020 ఫిబ్రవరి 28న ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే సేలం కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సస్పెన్షన్ ఆర్డర్ పై గత ఏడాది శశికుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు తాజాగా విచారణకు రావడంతో జస్టిస్ వైద్యనాథన్.. పిటిషనర్ ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని అన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో శశికుమార్ ను సస్పెన్షన్ లో ఉంచాల్సిన అవసరం సంబంధిత శాఖ అధికారులు లేదని అన్నారు. పక్షం రోజుల్లోగా శశికుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ ను జస్టిస్ వైద్యనాథన్ ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more