తనకు హెలికాప్టర్ కావాలంటూ.. దానిని కొంచెం కొనిపెట్టండి సారూ.. అంటూ ఓ మహిళా రైతు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసింది. ఔనండీ.. ఇప్పుడీ మహిళఆ రైతు లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇటు సోషల్ మీడియాలో అటు రాష్ట్రమీడియాలో అమె లేఖ పెను సంచలనంగా మారింది. దీంతో స్థానిక అధికారులతో పాటు అమె నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూడా వెనువెంటనే స్పందించారు. తాను అమెకు సాయం చేసి పెడతానని కూడా హామీ ఇచ్చారు. ఇంతకు అంత ఆఘమేఘాల మీద అధికారులు, శాసనసభ్యుడు స్పందించేందుకు కారణమేంటి.?
ఈ ప్రశ్నలను తెలుసుకునేందుకు ముందు అసలు ఈ మహిళా రైతుకు హెలికాప్టర్ తో ఏం పని.. అమెకు అంతటి అవసరమేంటి.. అన్న ప్రశ్నల్లోకి ఎంట్రీ ఇస్తే కానీ అసలు వివరాలు తెలియవు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్సౌర్ జిల్లాలొని బర్ఖేడా గ్రామంలో బసంతి బాయి అనే మహిళా రైతు నివసిస్తున్నారు. ఆమెకు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే ఆ పొలానికి వెళ్లేందుకు దారి లేదు. దీంతో అమె ఇతరుల పొలాలను దాటుకుంటూ వరాల మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఇతర పొలాల వాళ్లు ఆమెను రానివ్వడం లేదు.
ఈ సమస్యను పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు బసంతి బాయి. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె నేరుగా రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఇలా ఉంది. ‘అయ్యా మాది బర్ఖేడా గ్రామం. నాకు ఈ గ్రామంలో పొలం ఉంది. కానీ పొలానికి వెళ్లడానికి మార్గం లేదు. ఇతరులకు చెందిన పొలాలను దాటుకుంటూ వెళ్లాలి. నన్ను పొలాల గుండా రానివ్వడం లేదు. మీరు దయతలిచి హెలికాప్టర్ ఇప్పిస్తే నేను హెలికాప్టర్లో నా పొలానికి వెళ్తా’ అంటూ ఆమె లేఖ రాసింది. ఈ లేఖ సోషల్మీడియాలో తెగవైరల్ అవుతోంది.
బసంతి బాయి తన సమస్య అధికారులకు చెప్పేందుకు స్థానికంగా ఉండే ఓ టైపిస్ట్ సాయంతో ఈ లేఖ రాయించింది. ఈ లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్ పాల్ సింగ్ హెుటాహుటిన స్పందించారు. ఈ విషయంపై యశ్పాల్ మాట్లాడుతూ.. ‘సదరు మహిళా రైతుకు నేను హెలికాప్టర్ అయితే ఇప్పించలేను. కానీ కచ్చితంగా ఆమె సమస్యను పరిష్కరిస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాదు వెనువెంటనే సంబంధిత తహసిల్ అధికారులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులను కూడా మహిళా రైతు సమస్యపై వివరణ అడిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more