ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 78వ రోజుకు చేరాయి. తమ దీక్షలు, నిరసనలను.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ మొర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావాతి ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు పళ్లెం గంటలను మోగించి పెద్ద శబ్దాలు చేస్తూ నిరనసను వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం జగన్ కు వినబడేలా శబ్దాలు చేస్తూ నిరనసను తెలపాలని క్రితం రోజునే అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు.
అమరావతి జేఏసీ నేతల పిలుపు మేరకు ఇవాళ నిరసన శిభిరాల వద్దకు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత చేరుకునే సమయంలోనే వారంతా తమ వెంట గరిటలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, మహిళలు తమ ఆక్రందనను ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామల ప్రజలు.. ఆయా గ్రామాల పరిధిలో పళ్లెం, గరిటలను మోగిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతర్జాతీయ కోర్టులో అమరావతిపై పిటీషన్
ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయి రాజధానిని అమారావతిలోనే కొనసాగించాలంటూ స్థానిక రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటం ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టు దృష్టికి వెళ్లింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు అమరావతి విషయమై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖల చేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్రభుత్వం వారితో ఒప్పందాలు చేసుకుందని, వాటిని తాజాగా ఉల్లంఘిస్తుండటంతో రైతులు, మహిళలు 78 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, దీంతో పాటు మానవహక్కులకూ విఘాతం కలుగుతోందని శ్రీనివాసరావు తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కావేటి శ్రీనివాసరావు పిటీషన్ తమకు అందినట్టుగా అంతర్జాతీయ కోర్టు ప్రాసిక్యూటర్ కార్యాలయంలోని సమాచార, సాక్ష్యాల విభాగం అధిపతి మార్క్ పి.డిలాన్ ధృవీకరణ పత్రం జారీచేశారు. ‘మీరు పంపిన సమాచారాన్ని మా కార్యాలయం కమ్యూనికేషన్ రిజిస్టర్లో నమోదు చేశాం. అంతర్జాతీయ కోర్టు నిబంధనల ప్రకారం... మీ పిటిషన్ను పరిశీలించి, దానిపై మా నిర్ణయాన్ని మీకు తగిన సమయంలో తెలియజేస్తాం. ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేసినంత మాత్రాన... మీ పిటిషన్పై మేం దర్యాప్తు ప్రారంభించినట్టుగా గానీ, ప్రారంభిస్తామని గానీ హామీ ఇచ్చినట్టు భావించరాదు. మీ పిటిషన్ పై మేం ఒక నిర్ణయం తీసుకున్నాక... అదేంటో, ఆ నిర్ణయానికి రావడానికి కారణాలేంటో లిఖితపూర్వకంగా తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more