రాజోలులో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని నిగురు గప్పిన నిప్పులా పరిస్థితి ఏర్పడటంతో స్థానికులు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేయడంతో పెద్ద సంఖ్యలో జనసైనికులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. అసలేం జరుగుతుందో తెలియని సామాన్యులు కలవరానికి గురవుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పీఎస్పై దాడి ఘటనలో ఎమ్మెల్యేపై 3 రోజుల కిందట కేసు నమోదయ్యింది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన్ను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేతోపాటు జనసేన కార్యకర్తలంతా పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ముట్టడి సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముందస్తుగా రాపాక ముఖ్య అనుచరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో.. అక్కడంతా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఏకవచనంతో మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పీఎస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో.. జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ సందర్భగా ఉద్రిక్తత తలెత్తడంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా ఇవాళ అరెస్టుకు ప్రయత్నిస్తుండంతో.. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more