ఒక గుడ్డు ధర ఐదు రూపాయలు వుంటుంది. అయితే అదే గుడ్డును ఉడకబెడితే.. రూ. 10 నుంచి 12 లేదా మరీ కొంచెం పెద్ద హోటళ్లలో అయితే 20 లేదా 25 వరకు వసూళ్లు చేస్తారు. ఇక దానినే ఆమ్లేట్ వేస్తే 25 నుంచి 30 వరకు చార్జ్ చేస్తారు. అయితే అదే స్టార్ హోటల్ లో అయితే ధర కొంత ఎక్కువగా వేస్తారన్న విషయం తెలిసిందే. అయినా దాని ధర మహా అంటే 100 నుంచి 150 వరకు మాత్రమే ఉంటుంది.
ఈ రేట్లు విన్న మధ్యతరగతి వారు ‘‘బాబోయ్ అంత డబ్బు పెట్టి తినేవాళ్లుంటారా.? అని కూడా విస్తుపోతారు. అలా అని అవి కోడి గుడ్లు కాకుండా మరోదే పక్షి గుడ్లు అనుకుంటే పొరబాటే. అవి సర్వసాధారణమైన కోడి గుడ్లే. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు.. అంటే ముండైలోని ఓ హోటల్ రెండు ఉడికించిన గుడ్లకు రూ.1700 బిల్లు వేశారు. సాధారణ కోడి గుడ్లకు అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందీ అంటే.. అవి ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లడం వల్ల వాటి ‘విలువ’ పెరిగిందంతే!
కొద్ది రోజుల కిందట బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ బస చేసిన ఓ హోటల్లో రెండు అరటి పండ్లకు రూ.442 వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. తాజాగా కార్తిక్ ధార్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయంగా మారింది. ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్.. ఉడికించిన రెండు గుడ్లకు రూ.1700 వసూలు చేసినట్లు ఆరోపించాడు.
ట్విట్టర్లో రాహుల్ బోస్ను లింక్ చేసి ‘‘అన్నా.. ఉద్యమిద్దామా?’’ అంటూ ఆ హోటల్ బిల్లును ట్వీట్ చేశాడు. దీంతో అది వైరల్గా మారి చర్చనీయమైంది. ఈ ట్వీట్ చూసిన నెటిజనులు ఆశ్చర్యపోవడమే కాకుండా జోకులు కూడా వేస్తున్నారు. కొందరు ట్విట్టర్ యూజర్లు యూజర్ కు సలహాలు ఇవ్వగా, అనేకమంది మాత్రం ట్విట్టర్ లో హోటల్ యాజమాన్య నిర్వహకులపై మండిపడుతున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో చూడండీ..
2 eggs for Rs 1700 at the @FourSeasons Mumbai. @RahulBose1 Bhai Aandolan karein? pic.twitter.com/hKCh0WwGcy
— Kartik Dhar (@KartikDhar) August 10, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more