తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో కొంత మంది రాజకీయ లబ్ధి కోసం సమస్యను వివాదాస్పదం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వ్యవహారంపై తాము నియమించిన కమిటీ 3 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందనీ, అప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కొందరు చేస్తున్న రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబరీనీ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ మానవ తప్పిదమని తేలితే ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చిచెప్పారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు మరోసారి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాగా, ఇంటర్ మార్కుల వ్యవహారంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని గ్లోబరినా సంస్థ తనను తానుగా దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థే కారణమని కొందరు ఆరోపిణలు వినిస్తున్నా వేళ.. తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని సంస్థ వర్గాలు వాదిస్తున్నాయు. ఈ నేపథ్యంలో గ్లోబరీనా సంస్థ అధినేత, సీఈవో వీఎస్ఎన్ రాజు స్పందించారు. తెలంగాణ బోర్డు విడుదల చేసిన ఫలితాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము పారదర్శకంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకు ఆదేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తాము టెండర్లు దక్కించుకోవడం వెనుక ఎలాంట రాజకీయ ఒత్తిళ్లు లేవని రాజు అన్నారు. మిగతా సంస్థల కంటే తక్కువ కోట్ చేశాం కాబట్టే టెండర్ తమకు దక్కిందని పేర్కొన్నారు. తమపై కాకినాడ జేఎన్ టీయూ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. జేఎన్ యూటీ సంస్థే తమకు ఇంకా కోట్లాది రూపాయలు చెల్లించాలన్నారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలని రాజు కోరారు. అయితే ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థ ఇంటర్ బోర్డు నిబంధనలకు నీళ్లు వదిలి టెండర్ ను రాబట్టకుందన్న అరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ జవాబు పత్రాలను మరోమారు రీవాల్యూయేషన్ లేదా రీ కౌంటింగ్ చేయించుకునేందుకు ఇంటర్ బోర్డు రెండు రోజుల అదనపు సమాయాన్ని కూడా కేటాయించింది. ప్రసుత్తం ఈ నెల 25 వరకు మాత్రమే రీ కౌంటింగ్, రీ వాల్యూయేషన్ కు సమయాన్నిచ్చిన ఇంటర్ బోర్డు.. పెద్ద ఎత్తున్న విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం వస్తున్న క్రమంలో ఇంటర్ బోర్డు సైట్ కూడా పనిచేయడం లేదని విమర్శల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more