దాయది దేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దొంగదెబ్బ తీసి మన దేశ సైనికులపై అత్మహుతి దాడికి పాల్పడి ఏకంగా 48 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన ఘటనను భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఇది పిరికి పంద చర్యని.. విదులకు హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న జవాన్లను టార్గెట్ గా చేసుకుని ఈ దారుణ ఉగ్రబీభత్సానికి ముష్కరులు పాల్పడటాన్ని దేశం మొత్తం తీవ్రంగా అక్షేపించింది.
అయితే అమరవీరులకు పట్ల తమ సానుభూతిని, సంతాపాన్ని చాటుకునే క్రమంలో భాగంగా దేశప్రజలు వారి కుటుంబాలకు అండగా వుంటామని ప్రతీణబూనుతూ.. వీరజవాన్ల అంతిమయాత్రలో పాల్గోంటున్నారు. అయితే ఆత్మాహుతి దాడిలో అమరుడైన ఓ సీఆర్పీఎఫ్ జవాను శవపేటిక ముందు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్ సెల్ఫీ దిగడం చర్చనీయాంశమైంది. దీనిని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అమరవీరుడు వసంతకుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సాగుతున్న వేళ, నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన, సెల్ఫీలు దిగడం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కనీస బాధ్యతను మరిచి ఇలా చేయడం తగదని ఎద్దేవా చేస్తున్నారు.
ఇక నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలపై అల్ఫోన్స్ స్పందిస్తూ, తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నానని, తన తండ్రి కూడా సైనికుడేనని అన్నారు. ఓ సైనికుడు అమరుడైతే ఎంత బాధ కలుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. అయితే, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టి, విమర్శలకు గురికావడం అల్ఫోన్స్ కు ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ఆశ్రయం పొందుతున్న బాధితులను కలిసిన అల్ఫోన్స్, సెల్ఫీలు దిగి పోస్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వెల్లువెత్తాయి.
Narcissism at its Peak.
— Bijoy (@BijoyBijoyummer) February 16, 2019
This #Proverb suits
"As The King So Is The Minister"#minister #alphonse #kannanthanam pic.twitter.com/0MXYD69zOf
@alphonstourism ,former beauracrat and presently BJP minister, in the most insensitive manner, poses for a selfie during the funeral of Swntham Kumar who was killed in #PulwamaAttack !
— balu sunil (@balusunil2) February 16, 2019
Moral of the story: Cracking civil service is no benchmark for anything. pic.twitter.com/7UwViYcPpv
What a shame Mr.Alphonce Kannanthanam..Taking selfie infront of our soldiers dead body..#shameOnYouAlphonse pic.twitter.com/G534QNm4N4
— Shan Shakir (@ShanShakir1) February 16, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more