కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమని.. ఇటీవల బీజేపీ నేత ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అప్పటివరకు ధీమాగా వున్న కాంగ్రెస్ నేతలు హుటుహుటిన బెంగుళూరులో కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హజారు కావడం కాంగ్రెస్ పార్టీతో పాటు కుమారస్వామి ప్రభుత్వంలో కలకలం రేపింది.
అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 76 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపి పార్టీ అపరేషన్ కమలం సాగిస్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అవకాశం ఇవ్వకూడదని భావించిన కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా.. బీజేపి ప్రలోభాలకు లోంగకుండా.. మరోమారు రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. తమ ఎమ్మెల్యేలందరినీ ఈగల్టన్ రిసార్ట్కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.70-75 కోట్లు ఇవ్వజూపిందని.. మోదీకి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. దేశంలోని కుభేరులైన వారికి సంక్షేమాన్ని కాంక్షించే ప్రధాని వారి సహకారంతోనే తమ ఎమ్మల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయాలని చూస్తున్నారని.. వారికి కోట్ల రూపాయల ఆశజూపి ప్రలోబాలకు గురిచేస్తున్నారని అరోపించారు.
కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నిస్తోందని... ఈ కుట్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భాగస్వాములేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న డబ్బు నోట్ల రద్దు ద్వారా సంపాదించినవా.? లేక రాపెల్ డీల్ వ్యవహారంలో సంపాదించినవా.? అంటూ ఆయన ప్రధాని మోదీ టార్గెట్ గా ప్రశ్నలు సంధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more