bride calls off wedding in dry Bihar after groom arrives drunk మద్యం సేవించిన వరుడు.. పెళ్లి కాన్సిల్..

Bride calls off wedding in dry bihar after constable groom arrives drunk

Investigation, bride cancels wedding, Marriage, Bihar, Wedding called off, Kahalgaon, Nalanda district, Police, crime

A bride-to-be in dry Bihar declined to tie the knot when she learnt that her would-be husband had arrived in an inebriated condition, after which the groom a police constable was arrested.

నిషేధిత రాష్ట్రంలో మద్యం సేవించిన వరుడు.. పెళ్లి కాన్సిల్..

Posted: 01/19/2019 10:59 AM IST
Bride calls off wedding in dry bihar after constable groom arrives drunk

ఆకాశంలో సగమంటూ మగవారితో సమానంగా తాను నడుస్తున్న మహిళ.. ఇప్పటికే మగవారికన్నా అనేక అడుగులు ముందుకేసింది. అరుబయట బహిర్భూమికి వెళ్లడం ఇష్టంలేని యువతులు.. మారిన కాలంతో పాటు తాము మారుతున్నామని, తమకు ఇంటి అవరణలోనే టాయ్ లెట్ వుంటే తప్ప కాపురాలకు రామని తెగేసి భర్తలను, అత్తవారింటిలోని మనుషులను నొప్పించకుండా ఒప్పించి మరీ ఆ తరువాత కాపురాలు వస్తున్న ఘటనలు ఇదివరకే అనేకం చూశాం.

ఇక తాజాగా మద్యం అలవాటు వున్నవారిని కూడా చేసుకోబోమని యువతులు భీష్మించుకుంటున్నారు. ఇదివరకే ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్న ఉత్తరభారతంలో అదే తరహాలో మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. మద్యనిషేదం వున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన వివాహానికి ముందు ఫూటుగా మద్యం సేవించాడు. అంతేకాదు వధువు మేనమామతో గోడవపడి అయనపై చేయిచేసుకున్నాడు. విషయం తెలిసిన వధువు తనకు తాగుబోతుతో పెళ్లే వద్దని రద్దు చేసుకుంది.

మద్యం అలవాటు ఉన్న వ్యక్తిని తాను వివాహం చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. పెళ్లిలోనే పీకల వరకు మద్యం సేవించిన వరుడు.. పెళ్లైన తరువాత తాగి తనపై జులుం సాగించడని ఏంటీ నమ్మకమని పెద్దలకు వివరించింది. దీంతో అమె తీసుకున్న నిర్ణయానికి పెద్దలు కూడా సరేనన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని తిలక్‌పూర్‌కు చెందిన ఉదయ్ రజన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

అతడికి అక్బర్ పూర్ కు చెందిన యోగేంద్ర రజక్ కుమార్తెతో వివాహం నిశ్చయమయ్యింది. వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. బంధువులతో పెళ్లి మండపం కళకళలాడుతుండగా.. మగపెళ్లివారు మండపానికి చేరుకున్నారు. అయితే వరుడు ఉదయ్ ఫుల్లుగా మద్యం సేవించి మండపానికి వచ్చాడు. వచ్చీ రాగానే కట్న కానుకలకు సంబంధించిన విషయమై కాబోయే మామతో గొడవకు వాగ్వాదానికి దిగాడు. మద్యం సేవించి ఉన్నాడని తెలిసి వధువు అవాక్కయ్యింది.

మద్యం సేవించే అలవాటు ఉన్న వ్యక్తిని తాను వివాహం చేసుకోనని కుండబద్దలు కొట్టింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు మద్దతుగా నిలిచారు. దీంతో ఆ పెళ్లి రద్దయ్యింది. అంతేకాదు వరుడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. బాధ్యతగల కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ.. పెళ్లి రోజే మద్యం సేవించిన ఉదయ్‌పై కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles