ఎన్నికలకు సరిగ్గా పక్షం రోజుల సమయం మాత్రమే మిగిలివున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్కు జైకొట్టారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో ఆయన తెలంగాణ తాజా రాజకీయాలపై చర్చించారు. భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో కలిసి మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ నెల 23న మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో.. సోనియా గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరబోతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తన నియోజకవర్గంలోనూ ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. అధికార పార్టీ ఎంపీగా ఉండి కూడా వాటిని సమస్యల్ని పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లగా ఆ పార్టీ విధానాలు మారిపోయాయని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ఉద్యమకారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. టీఆర్ఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. రాష్ట్రానికి న్యాయం చేయాలంటే కాంగ్రెస్కే సాధ్యమవుతుందన్నారు.
వ్యక్తిగత వైరంతో పార్టీని వీడలేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఒకవేళ వ్యక్తిగతంగా విభేదాలుంటే.. నాలుగేళ్ల క్రితమే పార్టీ నుంచి బయటకు వచ్చేవాడినన్నారు. పార్టీపరమైన నిర్ణయాలను విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. కేసీఆర్ కొన్ని మంచి పథకాలు చేపట్టినా.. తర్వాత పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లానన్నారు కొండా.
ఇది ఆరంభం మాత్రమే.. త్వరలో టీఆర్ఎస్కు అసలు సినిమా చూపిస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా అన్నారు. త్వరలోనే మరికొందరు నేతలు తమ పార్టీలో చేరబోతున్నారని పెద్ద బాంబ్ పేల్చారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి వస్తారన్నారు. ఎవరెవరనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీతో పాటు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ.. తెలంగాణ భవన్ కు మూడు పేజీ లేఖ రాసి పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more