పెద్ద నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా దేశవాసులు నాటి కష్టాలను మరోసారి తలచుకున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల దూరం వరకూ క్యూ లైన్లలో నిల్చుని పాత నోట్లను ఇస్తూ.. కొత్త నోట్లను తీసుకోవడానికి వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. తమ పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అసుపత్రి బిల్లులు ఇలా అన్నింటికీ అనేక కష్టాలు పడిన ప్రజలు కేంద్రప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో తాము అనేక అవస్థలు పడ్డామని ఆనాటి వైనాన్ని గుర్తు తలచుకొని కళ్లు చెమర్చారు.
ఇప్పటికే నోట్ల రద్దు రేండేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిన్ననే విమర్శలు గుప్పించారు. అయితే తామేం తక్కువ తిన్నామా.? అన్న నెటీజనులు కూడా మోడీ నిర్ణయాన్ని తమ సృజనాత్మకతను జోడించి మరీ విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా నోట్ల రద్దుపై సెటైర్లు వేశారు.
Leaked scenes from #ThugsOfHindostan #Demonetisation pic.twitter.com/HGziJIoYYv
— Junglee (@Junglee027) November 8, 2018
2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దైన విషయం తెలిసిందే. ఈ సంచలనం జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. నల్లధాన్ని రూపుమాపడం, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామంటూ ప్రధాని మోదీ నాడు ప్రకటించారు. వివిధ రంగాలపై దీని ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
The only one who opposed #Demonetisation #DemonetisationDisaster @PawanKalyan #JSPForPoliticalAccountability pic.twitter.com/J6vWArXrpY
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2018
నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని, ఇప్పుడు ‘స్టాట్యూ ఆఫ్ ఫెయిల్యూర్’ పేరుతో మరో విగ్రహం నిర్మిస్తారా.. అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. మోదీ భజనపరులకు నోట్ల రద్దు నచ్చిందని, ఈ ఒక్క కారణంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని మండిపడ్డారు. ‘సిద్ధంగా ఉండండి.. మేరే ప్యారే దేశ్ వాసియోం.. అంటూ ఆయన మళ్లీ మొదలుపెట్టొచ్చు..’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. మోదీ ఫూల్ డే, బ్లాక్ డే.. అంటూ మరికొంత మంది విమర్శలు కురిపించారు.
#Demonetisation is a @narendramodi made disaster who burned the farm to kill the mice...
What do you call when a person does this kind of an act??? #DestructionByDemonetisation pic.twitter.com/yMA67tgfb7
— Neha (@YourGalNeha) November 8, 2018
అదో పెద్ద స్కాం అంటూ మరికొంత మంది ఆరోపించారు. అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్న ప్రధాని మోదీ అన్నింటికంటే ముందుగా అదాయపన్ను శాఖను తమ అధీనంలోకి తీసుకున్నారని, దాని చలువతోనే భారీ కుంభకోణానికి తెరలేపారని నెటి జనులు విమర్శలు గుప్పించారు. ఎలుకల నిర్మూలన కోసం ఇళ్లు తగులబెట్టుకున్నట్లుగా నోట్ల రద్దు ఉందని మరో నెటిజన్ విమర్శించారు. ఇలాంటి పని చేసిన వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్యుల బాధలు, కన్నీటి వ్యథలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేశారు.
Two years post #demonetisation the Modi made disaster he is now trying to #Demonitis the @RBI no lessons learnt not even an apology for lives lost. Remember what you said @PMOIndia "give me 50 days or burn me alive"
— Swati Chaturvedi (@bainjal) November 8, 2018
This was the day remembering all the poor people stood in the streets of india in the name of #Demonitisation.
— Karthick G.S. (@karthick_INC) November 8, 2018
Modi Fool day Nov 08...2nd year of Indian economy death day...@INCIndia@RahulGandhi ji@DrParameshwara @dineshgrao @MYaskhi @manickamtagore @GCC_MP <ahref="https://t.co/FSEIfu2Y9L">pic.twitter.com/FSEIfu2Y9L
#Demonetisation
— Jaane Bhi Do Yaaro (@mat_jane_de_yar) November 8, 2018
Mera desh... Kya se kya ho gaya
Every institution is robbed off and still blind followers deny to see all this.
Media, Judiciary, Banks, CBI, CVC,
EC
Sabki MC BC kar di is Govt ne#DemonetisationDisaster pic.twitter.com/0ZKVetNeZJ
Be ready. May be he will start again "mere pyar Desh vasiyom.."#NOV8#Demonitisation pic.twitter.com/2MNbpiD98K
— Jaseel AM (@AmJaseel) November 7, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more