విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై తెలుగు రాష్ట్రాలలోని పలు పార్టీలు ఈ హత్యలను ఖండించాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో షాక్కు గురయ్యానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 'ఇద్దరు నేతల హత్యతో చాలా ఆవేదనకు గురయ్యా. సివేరి సోమ నాకు 2009-14 మధ్య అసెంబ్లీలో సహచరుడు. బాధాకరమైన ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరు నేతల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణ ఎన్నికలకు వినియోగించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. 2014 తర్వాత ఏపీలో పోలీస్, నిఘా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయాయని విమర్శించారు. పోలీసులు ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారని కన్నా తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.
నిన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరు అధికార పార్టీ నేతలను మావోయిస్టులు దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు, ఎమ్మెల్యే మద్దతుదారులు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు చావబాదారు. అనంతరం బయట ఉన్న పోలీస్ ఔట్ పోస్టుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ఫైళ్లు కాలి బూడిదయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి కారణంగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రాణాలు పోయాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) అభిప్రాయపడింది. సర్వేశ్వర రావు, సోమల మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అరకు నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడ గ్రామంలో అక్రమంగా సాగుతున్న క్వారీ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలిద్దరు ఇవాళ ప్రాణాలతో ఉండేవారని అభిప్రాయపడింది.
ఉత్తరాంధ్ర పోరాటయాత్రంలో భాగంగా గూడ గ్రామస్తుల విజ్ణప్తి మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గ్రామాన్ని సందర్శించి.. వారి బాధను అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని క్వారీ మూసివేతకు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్యాక్ గుర్తు చేసింది. అక్కడి క్వారీ తవ్వకాల మూలంగా తాగునీటి వనరులు కలుషితమైన తీరుని అక్కడి గ్రామస్తులే పవన్ కల్యాణ్ కి చూపించిన విషయాన్ని, తమ ఇళ్ళు దెబ్బతింటున్న విషయాన్ని, తాముపడుతున్న ఇబ్బందులనీ తెలియజేయడాన్ని ప్యాక్ గుర్తు చేసింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మైనింగ్ వ్యవహారాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్యాక్ డిమాండ్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more