దేశవ్యాప్తంగా గూగుల్ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో హైదరాబాద్ ఐఐటీ నుంచి తెలుగమ్మాయి ఎంపికైంది. అమెకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఐఐటీ హైదరాబాద్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ దక్కని అరుదైన అవకాశం ఈ అమ్మాయికి లభించింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థినిగా కుడుగంటి స్నేహారెడ్డి చరిత్రను సృష్టించింది. గూగుల్ ఐఐటీ క్యాంపస్ సెలక్షన్లలో కృతిమ మేథపై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయడానికి దేశవ్యాప్తంగా పలువుర్ని ఎంపిక చేసి అందులోంచి చివరగా ఐదుగురు ప్రతిభావంతులకు నియామకం చేసుకుంది. వీరి ఒక్కొక్కరికీ రూ.1.2 కోట్ల వార్షిక వేతనంతో ఆ సంస్థ ఉద్యోగం ఇచ్చింది.
వికారాబాద్కు చెందిన స్నేహారెడ్డి ఐఐటీ హైదరాబాద్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. చదువుతోపాటు మిగతా విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన స్నేహా.. తన అత్యుత్తమ ప్రతిభతో ఐఐటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకున్నారు. చదువుతోపాటు కో-కరిక్యులర్ యాక్టివీటిస్ లోనూ చురుగ్గా ఉండే స్నేహారెడ్డి 98.4 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించారు. జేఈఈ 2014 (మెయిన్స్)లో ఆలిండియా 15వ ర్యాంకు, జేఈఈ(అడ్వాన్సుడ్)లో 677వ ర్యాంకును సాధించారు. తర్వాత ఐఐటీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్లో చేరి బీటెక్ పూర్తిచేసింది.
‘నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్’ ప్రాజెక్టు కోసం గూగుల్ సంస్థ ప్రతిభావంతులను ఎంపికచేయడానికి అన్వేషణ ప్రారంభించింది. దీనికి ఆన్ లైన్ ద్వారా ఎంపిక నిర్వహించింది. ఇందులో స్నేహారెడ్డి కూడా పాల్గొని తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. తుది ఎంపిక కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉండగా మరో ముఖ్యమైన పరీక్ష ఉండటంతో హాజరు కాలేకపోయారు. అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ తుది పరీక్షను కూడా ఆన్ లైన్ లో నిర్వహించి ఎంపిక చేసింది. విద్యార్థులను పరిశోధనల దిశగా ఐఐటీ అధ్యాపకులు ప్రోత్సహించడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. దీంతో పాటు బీటెక్ చదువుతున్నప్పుడే అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కిందని ఆమె అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more