కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆ ఇద్దరి సభ్యత్వాన్ని శాసనసభ ఏకగ్రీవ తీర్మాణంతో రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల నోటిషికేషన్ ను కూడా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సవాల్ చేసింది. కాంగ్రెస్ దాఖలు చేసిన ఫిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆరు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ సందర్భంగా వీరిద్దరూ అసెంబ్లీలో చివరి బడ్జట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో మైక్ విసిరేశారు. అది కాస్తా మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలిందని, దీంతో వారిద్దరీ అనర్హులుగా ప్రకటించామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, అధారాలు, సిసిటీవీ ఫూటేజీలు కూడా వున్నాయని తెలిపారు. దీంతో విచారణను ఈ నెల 22కు వాయిదా వేసిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘంతో వారం రోజుల పాటు ఎన్నికల నోటిఫికేషన్ అపితే అభ్యంతరాలేంటని ప్రశ్నించింది.
దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో ఏకీభవించని న్యాయస్థానం కోమటిరెడ్డి, సంపత్ లకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని ఈసీకి ధర్మాసనం సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి వీడియోలను షీల్డ్ కవర్లో పెట్టి ఈనెల 22న కోర్టుకు అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more