ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ.. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించేందుకు ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకున్న ప్రజానికం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. విద్యార్థులతో ప్రారంభమైన ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లడంతో రైతులు, రైతు కూలీలు, తెలంగాణ ఇంటి అడపడచులు అందరూ ఉద్యమంలో పాల్గోనడంతోనే రాష్ట్ర అవిర్భావం అనివార్యమైంది. రాష్ట్రంతో తమకు చేసేది ఏంటన్న భావనతో ఆరు దశాబ్దాల పాటు ఉద్యమం అంతర్లీనంగా వుండిపోయింది. అయితే అదే తమకు నేరుగా సమస్య ఉత్పన్నమైతే.. ఎరువుల కోసం పోలీసుల లాఠీల దెబ్బలు తీన్న రైతాంగం ఊరకుంటుందా.?
అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పలు గ్రామాల ప్రజలు ఎదుర్కోంటున్న సమస్య అది. దీంతో సంఘటితమైన రైతులు తమ మండలానికి వచ్చిన ఎమ్మెల్యేను మార్గమద్యంలో రైతులు ఎధురేగి నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వారి ప్రశ్నలకు బదులీయలేక అక్కడి నుంచి నడస్తూ పక్కకు వెళ్లినా.. వదలకుండా వెంబడించిన రైతులను తప్పించుకునేందుకు ఎమ్మెల్యే పరుగు తీయాల్సి వచ్చింది. ఇంతలో పోలీసులు సకాలంలో స్పందించి.. ఎమ్మెల్యేను తమ వాహనంతో తీసుకెళ్లడంతో మొత్తానికి రైతుల చెర నుంచి తప్పించుకున్నారు.
అసలేం జరిగిందంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయన వస్తున్నారన్న సమాచారం అందుకున్న రైతులు మార్గమధ్యంలోనే ఆయన వాహనాన్ని అడ్డుకుని సాగు నీటి విషయమై నిలదీశారు. వారి ప్రశ్నలకు నోరళ్లబెట్టిన ఎమ్మెల్యే ఏం చెప్పాలో తెలియలేకపోయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పినా రైతులు వినే పరిస్థితిలో లేరు. అయితే కార్యక్రమ నిర్వాహకుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని సభకు హాజరయ్యారు ఎమ్మెల్యే.
దీంతో సభా కార్యక్రమ పూర్తైయ్యేంత వరకు అక్కడే వున్న రైతులు కార్యక్రమం ముగియగానే నేరుగా ఎమ్మెల్యే వాహనం వద్దకు చేరకుని ఘెరావ్ చేశారు. సభ అనంతరం వెళ్లిపోయేందుకు యత్నించిన అయనకు చేదు అనుభవం ఎదురైంది. రైతులు సంధిస్తున్నప్రశ్నలకు బదులు చెప్పలేకపోయారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన వాహనాన్ని వదిలి కారు దిగి రాజీవ్ రహదారిపైకి నడుచుకుంటూ వెళ్లారు. అయినప్పటికీ రైతులు మరింత ఆగ్రహంతో ముందుకు రావడంతో మనోహర్ రెడ్డి పరుగు తీయాల్సి వచ్చింది. ఇంతలో పోలీసులు వచ్చి ఆయనను తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more