తలకు హెల్మట్ ఎవరి కోసం పెట్టుకోవాలని నిబంధనను తీసుకువచ్చారు పోలీసులు అంటే.. మన సంరక్షణ కోసమేనని సమాధానమిస్తాం. అలాగే మద్యం తాగి వాహనాలను నడపరాదన్న నిబంధనలను పోలీసులు ఎందుకు తీసుకువచ్చారంటే.. ప్రమాదాలు చెప్పిరావు. మద్యం తాగినప్పుడు నియంత్రణ కోల్పోయిన పక్షంలో ప్రమాదం ఎదురైతే అది ఆ వ్యక్తి, వ్యక్తులు కుటంబాల భవిష్యత్తునే చిదిమేస్తుందన్నది సత్యం. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లు వద్దని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి మరీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దీంతో పెద్ద కేసుల నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోవచ్చు కానీ, డ్రండ్ అండ్ డ్రైవ్ కేసుల్లోంచి మాత్రం తప్పించుకోవడం కష్టమని అన్నివర్గాలకు చెందిన ప్రజలు భావిస్తున్నారు. వారే కాదు రాజకీయ నేతల నుంచి అందరిదీ ఇదే మాట. ఈ నేపథ్యంలో యువత మరింత విభిన్నంగా అలోచించింది. పోలీసులకు చెక్ పాయింట్ల వద్ద వారికి చెక్ పెట్టేందుకు మరో కొత్త ఎత్తుగడను పన్నింది. పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.
అసలింతకీ ఏం జరిగిందంటే... దగ్గర్లో బార్ ఉందో ఏమో... చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు. ఇంకేముందు, ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని నడుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. అలా ఒకరు, ఇద్దరూ కాదు... వందల మంది ఇలా బండి నడిపించుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదుగానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడిపించుకుని కూడా వెళ్లకూడదన్న చట్టం తేవాలేమో? ఆ వీడియోను మీరు వీక్షించండీ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more