భారతీయ స్టేట్ బ్యాంకు మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు దేశంకాని దేశంలో పరాభవం ఎదురైంది. అమెకు మాత్రమే కాదు అమెతో పాటు డజన్ల కొద్ది భారతీయులకు ఈ అనువాన్ని చవిచూడాల్సి వచ్చింది. కేవలం భారతీయులకే కాదు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ ఆ విమానయాన సంస్థ చుక్కలు చూపిచింది. ముంబై నుంచి లండన్ కు వెళ్లాల్సిన బీఏ 198 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరాల్సి ఉండగా లండన్ లో భారీ మంచు కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
విమానం టేకాఫ్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ గ్యాలరీలో యాసిడ్ వాసన రావడాన్ని గమనించారు. కొద్ది సేపటికి పొగలు కూడా వస్తున్నట్టు సిబ్బంది గుర్తించడంతో పైలట్ కు సమాచారం చేరవేశారు. దీంతో విమానాన్ని ఎవర్జెన్సీ ల్యాండింగ్ కోసం అన్ని విమానాశ్రయాలకు సమచారం చేరవేయడంతో.. వెంటనే స్పందించిన అజర్ బైజాన్ లోని బకు విమానాశ్రయం నుంచి అత్యవసరంగా ల్యాండింగ్ అనుమాతి లభించడంతో అక్కడ ల్యాండ్ చేశారు. అక్కడ సమస్యను గుర్తించిన ఇంజనీర్లు దానికి మరమ్మతులు చేశారు.
అయితే అప్పటికే తాము 12 గంటల డ్యూటీ చేయడంతో ఇక తమ వల్ల కాదని విమానాన్ని ప్రయాణికులను వదిలిపెట్టి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో మరో సిబ్బంది వచ్చి ప్రయాణికులను అదే విమానంలో గమ్యస్థానాలకు చేర్చాల్సి వచ్చింది. ఇందుకు గాను ఏకంగా 19 గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అయితే విమానయాన సంస్థ మాత్రం తాము ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించామని చెప్పడం గమనార్హం. ఈ సమయంలోనే విమానాశ్రయంలోని లాంజీలోనే నిద్రపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more