అమెరికాకు చెందిన మూడీస్ సంస్థ ఇటీవల మన దేశ అర్థిక పురోగతి అంశానికి సంబంధించి.. ర్యాంకును భారీగా పెంచడంతో.. అది తమ ప్రభుత్వ గొప్పదనంగా చెప్పుకున్న పాలకపక్షానికి.. అందులో భాగస్వామ్యంగా కొనసాగుతున్న పార్టీ వ్యంగాస్త్రాలను సంధించింది. నోట్ల రద్దు అంశంలో గొప్పలు చోప్పుకున్న ప్రభుత్వం. సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో ఆర్మీకి దక్కాల్సిన ఘనతను కూడా ప్రభుత్వం తమకే దక్కాలని తమకు ప్రభుత్వం అపాధించుకున్న నేపథ్యంలో శివసేన ప్రభుత్వాని, అధికార పార్టీని, చివరకు ప్రధాన మంత్రిని కూడా టార్గటె్ చేస్తూ వ్యంగోక్తులు విసిరింది.
దేశంలో ఎక్కడ ఏ మంచి జరిగినా.. ఏ క్రీడాకారుడు పతకాలు సాధించినా.. అపాధించుకునే పార్టీ నేతలు.. మరి ప్రపంచ సుందరి విషయాన్ని మాత్రం అనాధగా వదిలేశారేంటని ప్రశ్నించింది. దాదాపు 17 ఏళ్ల తరువాత భారత్ మరోమారు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుందని, ఆ ఘనతను సాధించిన మానుషి చిల్లర్ ను ప్రధాని నరేంద్రమోడీ కానీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కానీ ఎందుకు వదిలేశారని, వారు కాకపోయినా.. ఈ ఘనతకెు తమ పార్టీ విధానాలే కారణమని పేర్కొంటూ ఏ బీజేపి నాయకుడు ఎందుకు ముందుకు రాలేదని శివసేన ప్రశ్నించింది.
దేశంలో ఎవరు ఏ విజయాన్ని సాధించినా తమ విజయమే అన్నట్లు మోదీ ప్రభుత్వం చెప్పుకుంటోందని.. కానీ చిల్లర్ విషయంలో దానిని ఎందుకు వదిలిపెట్టిందని ఈ అంశాన్ని నోట్ల రద్దు వ్యవహారంతో ముడిపెట్టి మరీ నిలదీసింది. డిమానిటేజైషన్ తరువాత పెద్ద నోట్లు పోవడంతో దేశ ప్రజలందరి వద్ద కేవలం చిల్లరే మిగిలిందని.. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యంగ్యాస్త్రాలను సంధించింది.
సరిగ్గా ఇలాంటి ట్విట్ చేసిన కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ నెట్ జనుల విమర్శలకు గురైన తరువాత సామ్నా బీజేపిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.దీనిని దృష్టిలో పెట్టుకునే, ప్రధాని మోదీ వల్లే మానుషి మిస్ వరల్డ్ టైటిల్ను తీసుకువచ్చిందని బీజేపీ నేతలెవరూ ఇంకా ప్రకటించుకోలేదంటూ ఎద్దేవా చేసింది. ఆమె కిరీటాన్ని దక్కించుకోవడం మోదీ చలవేనంటూ బీజేపీ నేతలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చురకలంటించింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more