వైద్యో నారాయణ హరి’ అని, వైద్యుడు దేవుడితో సమానమనివారిని అశ్రయించే రోగులు, వారి బంధువులు బావిస్తున్నా.. రోగులును మాత్రం వైద్యులు మనుషులన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. కేవలం వారి నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతవరకు వారి ధనాన్ని పిండుతున్నారే తప్ప.. కనీసం వ్యాధి నయమయ్యేందుకు కూడా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నారు. ఈ తరహా దోపిడీలలో కార్పోరేట్ అస్పత్రులది మరీ అందవేసిన చెయ్యి అని చెప్పడంలో సంషయమే అవసరం లేదని ఈ ఘటన రుజువుచేస్తుంది.
జీఎస్టీ విధానం అమలు చేసి.. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి.. వైద్యులుగా తయారయ్యే ప్రతీ డాక్టరుకు ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధానాన్ని వెచ్చిస్తున్నా.. అ విషయాలేమీ పట్టక.. మా తెలివితేటలతోనే వైద్యులం అయ్యామన్న ధోరణిలో.. ఇక తెల్ల కోటు వచ్చిందని, అధికారికంగా వైట్ కాలర్ మాటున దోపిడికి లైసెన్సు వచ్చిందనన్నట్లు వ్యవహరించే వైద్యులు జనం మధ్యలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నా.. నిబద్ధతతో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వీళ్లు.. మానవత్వం మంటగలుపుతున్నారు. తాము తినేది, తాగేది కేవలం డబ్బే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బుకు మీదున్న శ్రద్ధ.. ప్రాణాలపై లేకుండా పోయింది.
తాజాగా దేశరాజధానిలో వెలుగుచూసిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మాటలలో చెప్పలేనిది. పక్షం రోజులుగా డెంగ్యూ వ్యాధికి చికిత్స చేసిన వైద్యులు.. వ్యాధిని నయం చేయలేదు.. కనీసం అమెను బతికించేందుకు కూడా చర్యలు చేపట్టలేదు. కానీ వ్యాధిబారిన పడిన చిన్నారి తల్లిదండ్రుల నుంచి మాత్రం లక్షల వసూలు చేసింది. రెండు వారాలు పాపను ఐసీయూలో ఉంచి.. చివరికి చేతులేత్తెసి, 16 లక్షల రూపాయల బిల్లు కట్టించుకుని తీసుకెళ్ళమన్నారు. ఆ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే బాలిక కన్నుమూసింది.
ఢిల్లీ సమీపంలోని గుర్ గామ్ లో ఏడేళ్ల ఆద్యాసింగ్కు ఆగస్టు 27న జ్వరం వచ్చింది. బాలికను ద్వారకాలోని రాక్లండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారికి డెంగీగా నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు ఆద్య తల్లిదండ్రులకు సూచించారు. దీంతో తల్లిదండ్రులు ఆగస్టు 31న గుర్గావ్లోని ఫోర్టిస్ హాస్పిటల్కు అద్యను తీసుకువచ్చారు. డబ్బు కట్టించుకున్న తరువాత అస్పత్రిలో చేర్పించుకున్న అద్యకు అక్కడి వైద్యులు చికిత్సను ప్రారంభించారు.
అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 10 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. సెప్టెంబర్ 14న MRI స్కానింగ్ తీయించారు. రిపోర్టులో ఆద్య మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు తేలింది. ఇక వైద్యం చేయలేమని డాక్టర్లు చేతులేత్తెశారు. ఈ 15 రోజులకు రూ.16 లక్షల బిల్ చేశారు ఫోర్టిస్ వైద్యులు. బిల్లుకు సంబంధించి 20 పేజీలతో వివరణ ఇచ్చారు. చేసేదేమి లేక 16 లక్షలు చెల్లించి.. మళ్లీ తిరిగి రాక్లాండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరిగ్గా సెప్టెంబర్ 14 అర్ధరాత్రి ఆద్య కన్నుమూసింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఫోర్టిస్ ఆస్పత్రే చిన్నారి ప్రాణాలు బలికొంది
ఇదే విషయాన్ని ఆద్య సింగ్ తండ్రి మిత్రుడు.. నవంబర్ 17న ట్విట్టర్లో ప్రస్తావించాడు. 15 రోజులు డెంగీకి చికిత్స చేసి చివరకు చిన్నారి ప్రాణాలను ఫోర్టిస్ ఆస్పత్రి బలిగొందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా రూ. 16 లక్షల బిల్ చేశారని పేర్కొన్నారు. ఈ ట్వీట్పై స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ వివరాలన్ని తమకు ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆరోగ్య కార్యదర్శికి మంత్రి నడ్డా ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more