ఎన్ని చర్యలు తీసుకున్నా పెట్రలో బంకు యాజమానులు వాహనదారులను చూ మంతర్ కాళీ.. అన్నట్లుగా దెబ్బకు మోసం చేస్తారు. మనం మీటరేనే చూస్తుంటాం.. కానీ అందులో వున్న చిప్ లు మనం చూస్తున్నది నిజం కాదని, మనకు పోస్తున్న పెట్రోల్ కూడా మీటర్ చూపించిన మోతాదులో వుండదని తెలిసినా.. అక్కడ చూపించే డబ్బులు మాత్రం చెల్లించక తప్పదు. అదరమారవాల్సిన అవసరం లేదు.. చూడలేమని చెప్పలేము కళ్లముందే చూస్తుండగానే మనం కళ్లను నమ్మలేని విధంగా జేబులు గుల్ల చేస్తున్నారు పెట్రోల్ బంకు యజమానులు అదెలా అంటే వివరాల్లోకి వెళ్తామా..
నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున డేవిడ్ కుమార్ అనే వ్యక్తి.. యూసుఫ్ గూడలోని ఓ పెట్రోల్ బంకులో తన టూ వీలర్ కు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ కొట్టించాడు. బంకు సిబ్బంది పెట్రోల్ పోస్తూనే ఉన్నారు. ఎంత అంటే 16.95 లీటర్లు కొట్టారు. ఆ బండి హోండా యూనికార్న్ 2013 మోడల్. ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ఆ బండి ట్యాంక్ కెపాసిటీ కేవలం 13 లీటర్లు మాత్రమే. చిత్రంగా 16.95లీటర్ల వరకు మీటర్ చూపించింది. అప్పటికీ ట్యాంక్ ఫుల్ కాలేదు. దీంతో షాక్ అయిన డేవిడ్.. వాటికి సంబంధించిన బిల్లు, మీటర్ రీడింగ్ కూడా ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
లీటర్ కు కేవలం 800 పాయింట్లు మాత్రమే వస్తుందని.. 200ml కాజేస్తున్నారని లెక్కలు వేశాడు. తన దగ్గర దోపిడీ చేసిన 250 రూపాయలు వద్దని.. ఇలాంటి మోసాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. అందరూ పెట్రోల్ బంకుకి బాటిల్స్ తో వెళితే మంచిదని సూచించాడు. ఈ పోస్ట్ 8వేల షేర్లతో ప్రతి ఒక్కరికి చేరుతూ టాప్ డిస్కషన్ గా నిలిచింది.ఈ మోసాన్ని ఓ యువకుడు వెలుగులోకి తీసుకొచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే హైదరాబాద్ మొత్తం వైరల్ అయ్యింది. 3వేల 500 లైక్స్, 8,880 షేర్స్ తో ఫేస్ బుక్ టాప్ లో ట్రెండ్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more