హైదరాబాద్ మహానగర శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలోని ఓ ఫాంహౌస్ లో కాల్పులు ఘటన కలకలం రేపింది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మిత్రుల మధ్య అభిప్రాయబేధాలతోనే కాల్పుల కలకలం రేగిందని సమాచారం. ఈ ఘటనలో ముస్తఫా అనే వ్యక్తి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. క్షతగాత్రుడ్ని బంజారాహల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
బుల్లెట్ గాయాలైన ముస్తఫా శరీరం నుంచి ఒక బుల్లెట్ ను తొలగించిన వైద్యులు అతని పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే వుందని తెలిపారు. అయితే ముస్తఫాను కావాలనే మైలార్ దేవ్ పల్లిలోని ఫాంహౌజ్ కు రప్పించి.. అతనిపై కాల్పులకు తెగబడ్డారు. క్రితం రోజు రాత్రి ఫాంహౌస్ లో బర్త్ డే పార్టీ ఉందని జుబేద్ అనే వ్యక్తి.. ముస్తఫాను ఆహ్వానించాడు. పార్టీకి అని వెళ్లాడు ముస్తఫాపై జుబేద్ దాడి చేసి తుపాకీతో కాల్పులకు దిగినట్లు సమాచారం. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల జుబేద్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మక తనిఖీలు చేశారు. అయితే తమతోనే వుంటూ తమపైనే అధాయపన్ను శాఖ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చాడని భావించాడు జెనైద్. దీంతో అతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుని బర్త్ డే పార్టీ అంటూ నిర్ఝన ప్రదేశమన మైలార్ దేవ్ పల్లిలోని ఫాంహౌజ్ కు అహ్వానించి అక్కడికి చేరుకున్న ముస్తఫాపై దాడి చేసి కాల్పులతో తెగబడ్డారు. జునైద్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more