టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించడం.. అతని తోడుగా అజింక్య రహానే కూడా నిలవడంతో.. అసీస్ తో కొల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా గౌరప్రదమైన స్కోరును చేసింది. వీరిద్దరూ మినహా మిగిలిన టీమిండియా అటగాళ్లు నిరాశ పరిచారు. కెప్టెన్ కోహ్లీ (92), ఓపెనర్ రహానె (55) మినహా మిగతా బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. దీంతో ఒక దశలో మూడు వందల పైచిలుకు పరుగుల భారీ స్కోరు చేస్తారన్న అంచనాలు తలకిందులయ్యాయి. చివరకు స్కోరుబోర్డుపై 252 పరుగులతో గౌరవప్రదమైన స్కోరుతో సరిపెట్టుకుంది టీమిండియా.
అదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (7) వికెట్ చేజార్చుకున్న టీమిండియా స్కోరుబోర్డును 8 బౌండరీల సాయంతో 92 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, 7 బౌండరీల సాయంతో 55 పరుగులు చేసిన రహానే పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్ కు 102 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థశతకాలు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే రనౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించి వెనుదిరిగాడు.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జాదవ్ (24) కొద్దిసేపు కెప్టెన్ కోహ్లీతో కలిసి బ్యాట్ ఝుళిపించాడు. స్కోరు వేగం పుంజుకుంటున్న క్రమంలో నైల్ బౌలింగ్లో మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి జాదవ్ వెనుదిరిగాడు. అవెంటనే విరాట్ కోహ్లీ కూడా శతకానికి చేరువగా వచ్చి బౌల్డ్ అయ్యాడు. ఇక ఆతరువాత టీమిండియా క్రికెటర్లు వికెట్లు క్రమంగా పడుతూ వచ్చాయి. ధోనీ(5) భువనేశ్వర్ కుమార్ (20), హార్దిక్ పాండ్యా(20), కుల్దీప్ యాదవ్ (0), బుమ్రా(10), చాహల్(1) స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 252 పరుగులకు ఆలౌట్ అయ్యి అసీస్ ఎదుట 253 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more