అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి వ్యాఖ్యలు ఇవాళ మీడియాతో పంచుకుని సంచలనాన్ని రేపారు. అనంతపురం ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని అని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన మనసాక్షి తనకు చెబుతుందని.. తన మనసాక్షి మేరకే తాను నడుచుకుంటున్నానని అందుచేత తాను తన ఎంపీ పదవికి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన నలబై ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారి తన మనసాక్షి తనను ఫెయిల్యూర్ ఎంపీ అని చెప్పిందని ఆయన అవేదనాభరితంగా చెప్పారు.
అయనేం అన్నారంటే.. నేను త్వరలో నా పదవికి రాజీనామా చేస్తాను. సోమ, మంగళవారాల్లో ఢిల్లీకి వెళ్లి.. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తన రాజీనామాను అందజేస్తానని అన్నారు. నేను ఎంపీగా ఫెయిల్ అయ్యా.. అది నా మనసాక్షి నాకు చెబుతుంది. నన్న నమ్ముకన్న ప్రజలకు నేనేమీ చేయలేదని నా మనసాక్షి పదే పదే నాకు చెబుతుంది. చాగల్లుకు నీళ్లు తేలేని నాకు ఎంపీ పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు. తాడిపత్రికి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్డను విస్తరించలేకపోయానని అన్నారు. ప్రజాహితం కోసం చేయాల్సిన పనులు చేయలేకపోయిన నాకు ఈ పదవి వుండి లాభం ఏంటని ప్రశ్నించుకున్నట్లు చెప్పారు.
ఇంకా ఎమ్మాన్నారంటే తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎంపీని కాలేదని, ప్రజల మద్దతుతోనే తాను గతంలో గెలిచాను.. ఈ సారి కూడా విజయాన్ని అందుకున్నానన్నారు. ప్రజలు తనపై అభిమానం చూపేది ప్రజలకు అందునా అక్కడున్న సమస్యలను పరిశీలించి.. అధిక మందికి లబ్దిచేకూర్చే పనులను మాత్రం చేసేవాడినని చెప్పారు. అందుకే ప్రజలకు తనను అదరిస్తున్నారని, ఈ స్థాయిలో నిలిపారు. విలువలేనప్పుడు తనలాంటివాళ్లు రాజకీయాల్లో వుండటం వృధా అని వ్యాఖ్యానించిన ఆయన తాను రాజీనామా చేస్తున్నది కేవలం ఎంపీ పదవికి మాత్రమేనన్నారు. అయితే పార్టీలో కొనసాగుతానని, చంద్రబాబు వెంటే నడుస్తానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more