దేశ టెలికాం రంగంలోనే పెను సంచలనాలతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. ఇప్పటికే దేశంలో అతిపెద్ద నెట్ వర్క్ గా అవతరించే స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. ఆ సంస్థ ప్రకటించిన ఫీచర్ ఫోన్ విషయంలో కూడా దేశంలోని కస్టమర్ల నుంచి అదేస్థాయిలో ప్రజాదరణ లభించిందట. ఆ రెస్పాన్స్ చూసి షాకైన జియో సంస్థ ఏకంగా సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ నిర్ణయం వెలువడగానే జియో ఫోన్ అభిమానులు నిరాశకు గురయ్యారంటే నమ్మండి. ఇంతకీ ఏంటా నిర్ణయం అనేగా...
జియో ఫిచర్ ఫోన్ బుక్కింగ్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో.. బుకింగ్ ను ప్రారంభించిన 36 గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫీచర్డ్ పోన్ ఫ్రీగానే ఇస్తున్నాం అయితే ధరావత్తుగా రూ.1500 తీసుకుని మళ్లి వాటిని మూడేళ్లలో తిరిగి ఇచ్చేస్తాం అన్న జియో ప్రకటన ఫలితంలో ఏమోగాని.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వినియోగదారులు.. ఈ ఫోన్ల బుకింగ్ కు ఎగబడటంతో.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నిమిషానికే జియో సైట్ క్రాష్ అయ్యింది. అ తరువాత సవ్యంగా సాగింది. అయితే సంస్థ యాజమాన్య నిర్ణయం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఈ దెబ్బతో దబ్బకు దిగివచ్చిన రిలయన్స్.. జియో ఫీచర్డ్ ఫోన్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సవ్యంగా సాగినా.. ఫలితం లేకపోయింది. దీంతో జియో ఫీచర్డ్ ఫోన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురికాగా, జియో యాజమాన్యం మాత్రం.. మీ స్పందనకు ధన్యవాదాలు.. మళ్లీ ఎప్పుడు బుకింగ్ ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని సమాచారం పోర్టల్ లో సమాధానపర్చిందట.
జియో 4జి ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కాగానే సైట్ క్రాష్ అయ్యింది. సంస్థ సాంకేతిక నిపుణులు మరమ్మతు పనులు చేపట్టి సైట్ ను వినియోగగంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత సైట్ లో రిజిస్ట్రేషన్లు సవ్యంగానే సాగాయి. అయితే నిదానంగా బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎందకంటే సంస్థ యాజమాన్యం బుకింగ్ ను క్లోజ్ చేసింది. కేవలం 36 గంటల మాత్రమే రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చిన యాజమాన్యం.. ఎంత మంది బుకింగ్ చేసుకున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కాగా, జియో ధన్యవాదాల మెసేజ్ ఆధారంగా చూస్తే కోటి ఫోన్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. బుకింగ్ ప్రారంభం అయిన 12 గంటల్లోనే 30 లక్షల మంది ఫోన్ను బుక్ చేసున్నారు. ఈ లెక్కను ఆధారం చేసుకుంటే కోటి మంది ఈజీగా ఉంటారని చెబుతున్నారు. ఆన్లైన్ సేల్స్లోనే జియో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ బుకింగ్స్ను నిలిపివేశారు. వెబ్ సైట్ లో థాంక్యూ ఇండియా అంటూ మెసేజ్ దర్శనం ఇస్తోంది. త్వరలోనే మరోసారి బుకింగ్స్ ను ప్రారంభిస్తామని జియో యాజమాన్యం తెలిపింది జియో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more