శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది.. Sena MP Ravindra Gaikwad engages in 'verbal spat' with cops

Sena mp ravindra gaikwad engages in verbal spat with cops

Ravindra Gaikwad, Shiv Sena MP, osmanabad constituency, ATM, Latur, Marathwada region, shiv sena

Shiv Sena MP Ravindra Gaikwad allegedly had a heated argument with cops over "non- functioning" of ATMs at Latur in Marathwada region,

ITEMVIDEOS: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది..

Posted: 04/20/2017 05:02 PM IST
Sena mp ravindra gaikwad engages in verbal spat with cops

శివసేన పార్లమెంటు సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ కు మళ్లీ కోపం వచ్చింది. ఎయిరిండియా అధికారులు తన బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ టిక్కెట్టుకు బదులు ఎకానామీ సీటును కేటాయించడంపై చిర్రెత్తుకోచ్చిన ఆయన ఏకంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ మేనేజరుపైనే దాడి చేసి.. అవును నేనే కోట్టాను 25 సార్లు చెప్పుతో కోట్టాను అని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎయిరిండియా నిషేధాన్ని విధించడంతో మారుపేర్లతో టిక్కెట్ బుక్ చేసుకుని.. పరాభావాలకు అలవాటుపడి.. చివరకు చార్టెడ్ ప్లేన్ ఎక్కి పార్లమెంటుకు వెళ్లి క్షమాపణలు కోరి.. మళ్లీ విమానం ఎక్కిన ఆయన.. గత నెల 2నుంచి వార్తల్లోని వ్యక్తిగా మారాడు.

ఆయనకు వచ్చిన పబ్లిసిటీ అంతాఇంతా కాదు. అయితే పార్లమెంటు సాక్షిగా కేంద్రమంతి అశోక గజపతి రాజుపై దాడికి యత్నించి.. ఎట్టకేలకు తాను అన్నమాటనే నెగ్గించుకున్న ఆయన అప్పట్లో వచ్చిన నెగిటివ్ పబ్లిసీటీని సాజిటివ్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో బాగంగా లాతూర్ లో ఏర్పాటు చేసిన ఏటీయం కేంద్రంలో దాదాపుగా పక్షం రోజుల నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బులతో కోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

   

డీమానిటేజైషన్ తరువాత కేవలం యాభై రోజులు మాత్రమే ఇస్తే దేశంలో మునుపటి పరిస్థితులను తీసుకువస్తామని చెప్పిన కేంద్రానికి దేశ ప్రజలు కష్టాలు పడైనా సరే 50 రోజులు ఇచ్చారు. అది పూర్తైనా.. ఇంకా సమస్య అపరిష్కృతంగానే వుండటంతో 100 రోజులు ఇచ్చారని, అదికూడా పూర్తైన తరువాత రెండు వందల రోజులు ఇచ్చారని, అయినా సమస్య ఇలా అలాగే వుందని ఆయన అరోపించారు. డబ్బులు అవసరమైన ప్రజలు ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలని నిలదీశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ధర్నాను ముగించాల్సిందిగా కోరగా, అయన వారితో వాగ్వాదానికి దిగారు. ప్రజల కష్టాల ముదు ట్రాపిక్ కూడా ఓ కష్టమేనా అంటూ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Gaikwad  Shiv Sena MP  osmanabad constituency  ATM  Latur  Marathwada region  shiv sena  

Other Articles