ఓవైపు సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఓ వార్తతో భాగ్యనగర వాసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాదులోని ఓ కాలేజీలో ఐఎస్ఐఎస్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయన్న వార్త కలకలమే రేపింది. అదే కళాశాలలో పని చేస్తున్న ఓ లెక్చరర్ చనిపోయే సమయంలో దీనికి సంబంధించి 'సేవ్ కంట్రీ' అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ తన ఫేస్ బుక్ లో పోస్లులు పెట్టడంతో వ్యవహారం అంతా బయటికి వచ్చింది.
మెదక్ జిల్లా బండారుపల్లి మండలం తొగుటకు చెందిన ప్రవీణ్కుమార్ (28) కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఇక్కడి అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎంఎస్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. తమ కాలేజీలో ఐసిస్ ఉగ్రవాద శిక్షణ జరుగుతోందని, అడ్డు చెప్పినందుకు ఉగ్రవాదులు, కళాశాల యాజమాన్యం తనను బెదిరించారని తన ఫేస్ బుక్ లో పోస్టుల్లో పేర్కొన్నారు. వారు కాలేజీ యాజమాన్య సాయంతో గతేడాది తనను హత్య చేయడానికి కూడా కుట్రపన్నారని అందులో పేర్కొన్నాడు. బుధవారం తెల్లవారుజామున 4.41 గంటల నుంచి 5.53 గంటల మధ్య ఆ పేజీలో దాదాపు 30 పోస్టులు పెట్టారు. ఆయన తన పేరు మీదే ఫేస్బుక్లో ఓ పేజీని నిర్వహిస్తున్నారు.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే వరంగల్ జిల్లా కేంద్రం లోని ఎంజీఎం సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్కుమార్ మరణించారు. ప్రవీణ్ స్నేహితులుగా చెప్పుకొంటున్న కొందరు.. ఆయన ఫేస్బుక్ పోస్టులను, ప్రమాదంలో మరణించడాన్ని పేర్కొంటూ ‘అలర్ట్’ పేరిట ఓ సందేశాన్ని తయారుచేశారు. ప్రవీణ్ మరణంపై లోతుగా విచారణ జరగాలంటూ.. వాట్సాప్, ట్వీటర్ల ద్వారా పలువురికి సందేశం పంపారు. ఇది మీడియాకు చేరడంతో కలకలం రేగింది.
అయితే ప్రవీణ్ మృతిపై ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొనడంతో మరణించినట్లు అందులో పేర్కొన్నారు. అదే సమయంలో గురువారం సాయంత్రం నుంచి సోషల్ మీడియా పోస్టుల సమాచారం అందడంతో ‘ఉగ్ర’కోణంలో దర్యా ప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఉగ్ర కుట్రలు భగ్నం చేయడమే కాకండా... పెద్ద ఎత్తున్న స్లీపర్ సెల్స్ ను నగరంలో ఎన్ఐఏ పట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ను ఎవరైనా కావాలని చంపారా అనేది తేల్చేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.కాలేజీ యాజమాన్యం మాత్రం అంతా ఉత్తదేనని కొట్టిపారేస్తోంది.
ప్రవీణ్ ఫేస్ బుక్ పోస్టులు...
దేశాన్ని కాపాడండి (4.41 గంటలకు), ఉగ్రవాదం నుంచి నా ప్రాణాలకు హాని ఉంది (4.43 గంటలకు), గతేడాది ఐఎస్ ఏజెంట్స్తో కలిసి నన్ను చంపేందుకు కొందరు ప్రయత్నించారు (4.44 గంటలకు) ఎంఎస్ కాలేజీలో హిందువులను వేధిస్తున్నారు (4.46 గంటలకు), భారత్ను పాక్ నుంచి కాపాడండి (5.03 గంటలకు), ఈ విషయాలను కొట్టిపారేయకండి (5.10 గంటలకు), నేను సంస్థ గురించే మాట్లాడుతున్నాను వర్గం గురించి కాదు (5.11 గంటలకు) ఇలా ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more