కాపు సామాజిక వర్గానికి న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి ఎవరైనా నేతను ముందుండి నిలిపితే తాను పక్కకు తప్పుకుంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. తనను కాపు జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. "దమ్మూ, ధైర్యం ఉంటే, చేతనైతే తునిలాంటి మీటింగ్ పెట్టి నన్ను తరిమి కొట్టించండి. అప్పుడు మీ సత్తా చూపినట్లవుతుంది. అంతే తప్ప, ముద్రగడ కాపు ద్రోహి. కాపుల్లో చెడబుట్టాడని తప్పుడు మాటలు చెప్పించొద్దని అన్నారు.
కాపుల అభ్యున్నతి కోసం తాను సాగిస్తున్న ఉద్యమంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయనన్నారు. ఇంటి వరండాలో కూర్చుంటాను. ఎంతమందితో కొట్టిస్తావో కొట్టించు. చెప్పులతో కొట్టాస్తారో... రాళ్లతో కొట్టిస్తారో మీ ఇష్టం. ఉన్నపళంగా ఆస్తి, అప్పులు వదిలేసి పోతాను. కానీ, మా సోదరులతో తప్పుడు ఆరోపణలు చేయించి, మా మధ్య తగవులు పెట్టకండి. ఇప్పటికే గ్రామాల్లో మూడేసి, నాలుగేసి గ్రూపులు తయారయ్యాయి. సిగ్గుమాలిన పని ఇది. మీ బతుకు కోసం, మీ కుర్చీని కాపాడుకునేందుకు మా జాతిని విడదీయ వద్దు. తప్పిది... క్షమించరాని నేరమని తెలియజేస్తున్నాను" అని ముద్రగడ నిప్పులు చెరిగారు.
కాపులకు న్యాయం చేస్తానన్న చంద్రబాబునాయుడు, తన హామీని వెంటనే నెరవేర్చుకుంటే, మరోసారి దీక్ష చేపడతానని కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. కాపు ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం తదుపరి ఎలాంటి కార్యాచరణకు దిగాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపిన ఆయన, తన రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు.
తన ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. అయితే, బెదిరింపు ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తుండటం మంచిది కాదని, దీనివల్ల సమస్యలు పెరుగుతాయని అన్నారు. మాటిమాటికీ తమ కుల నాయకులతో తనను తిట్టిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని హితవు పలికారు. వేధింపుల్లో భాగంగానే తన కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్యానంతరం కాపులపై ఉగ్రవాదుల కోసం తయారు చేసిన టాడా చట్టాన్ని ప్రయోగించాలని కూడా చూశారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more