చాయ్ వాలా జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని పీఠం పైకి ఎక్కి కూర్చున్న ఘనత నరేంద్ర మోదీది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశాన్నే బేసిక్ ప్రచార అస్త్రంగా వాడుకుని, చరిత్ర కందని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేనా మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశాడు.
ఎక్కడో అధో:పాతాళంలో ఉన్న పార్టీకి అన్ని సీట్లు రావడానికి కారణం ఒక్కటే. అదే, మోదీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ రూపుదిద్దిన ‘చాయ్ పే చర్చా’. అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన ఈ కార్యక్రమానికి ఆజ్యం పోసి వేదికగా నిలిచింది ఓ సాధారణ టీ స్టాల్. మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాదులో ‘ఇస్కాన్ గాంతియా టీ షాప్’ పేరిట వెలసిన ఈ టీ స్టాల్ దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుని ఆకర్షించింది.
అయితే రెండేళ్ల తర్వాత సదరు టీ స్టాల్ ఇప్పుడు మరోసారి హెడ్ లైన్స్ లో ప్రముఖంగా నిలిచింది. నిజానికి ఇస్కాన్ గాంతియా టీ షాప్ నకు సర్కారీ పర్మిషన్ లేదట. రెండేళ్లుపైగా ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న లేకుండానే వెలసిన ఈ టీ స్టాల్ కు మోదీ మేనియాతో జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు ఆ టీ స్టాల్ వద్ద నిలుపుతున్న వాహనాలు పెను సమస్యగా మారాయి. తాజాగా షాపు అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలన్న అహ్మదాబాదు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశాలకు యాజమాన్యం స్పందించలేదు. వెరసి సదరు ఇస్కాన్ గాంతియా టీ షాపు రెండున్నరేళ్లు గడవకముందే మూతపడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more