ఏపి అసెంబ్లీ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. రోజా వ్యవహారంలో రోజుకో మలుపుచోటుచేసుకుంటోంది. హైకోర్టు రోజాను అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు అనుమతినిచ్చినా కానీ స్పీకర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. దాంతో వైసీపీ దీని మీద తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కనీసం కోర్టుల తీర్పును కూడా గౌరవించకపోతే ఎలా అని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కోర్టు తీర్పును కూడా గౌరవించకపోవడం మీద వైసీపీ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. కాగా తాజాగా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ పిల్ దాఖలైంది.
వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం మీద వివాదం నడుస్తోంది. హైకోర్టు తీర్పులో రోజా సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కాగా ప్రస్తుత సమావే:శాలకు హాజరయ్యేందుకు అవకాశం కూడా కల్పించింది. కానీ స్పీకర్ మాత్రం దీని మీద నేడు చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోపక్క ప్రివిలేజ్ కమిటి మాత్రం రోజా సస్పెన్షన్ ను సమర్థించింది. కొడాలి నాని వ్యవహారం మీద శాసనసభ నిర్ణయం తీసుకోవచ్చని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా కోర్టు తీర్పును ధిక్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది. శాసనసభకు హాజరయ్యేందుకు రోజా వెళ్లగా, ఆమెను మార్షల్స్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వలేదు. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా చంద్రబాబు, కోడెల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని గోపాలకృష్ణ కళానిధి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు, కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more