రాజధాని నగరం హైదరాబాద్లో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు తాళాలు వున్న ఇళ్లకు కన్నాలు వేస్తూ.. దొంగులు విరుచుకుపడుతుంలే.. మరోవైపు చైన్ స్నాచర్లు కూడా ఒంటరి మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. మహిళాల ప్రాణాలపైకి తీసుకువస్తూ.. వారి మొడలోని మంగళసూత్రాలు, ఇతర బంగారు అభరణాలను తెంచుకుని పోతున్నారు. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్కు యత్నించాడు. అయితే ఆ మహిళ... అతడిని ధైర్యంగా ఎదుర్కొంది. ఈ సందర్భంగా ఆమెపై దుండగుడు దాడి చేసి, గాయపరిచాడు. మహిళ వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు ఫోన్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా అతడితో మహిళ పెనుగులాడింది. అంతేకాదు గట్టిగా కేకలు వేసింది. అమె అరుపులు విన్న పలువురు స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
దుండగుడు పాతనేరస్థుడని, అతడి పేరు కలాపి సంతోష్గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే చైన్ స్నాచింగ్ లు, బైక్ దొంగతనాలకు సంబంధించిన ఆరు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. గతంలో వీడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, గత నెల 31న జైలు నుంచి విడుదల అయ్యాడని పోలీసులు వెల్లడించారు. జైలుకు వెళ్లివచ్చిన బుద్ది మారని సంతోష్ మళ్లీ దొంగతనం కోసం కేబీఆర్ పార్క్ వద్ద కాపు కాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత మహిళ నవీన మాట్లాడుతూ ...వాకింగ్ చేస్తున్న సమయంలో తనను దొంగ కత్తితో బెదిరించాడని, నీ చైన్ ఇస్తావా?...చచ్చిపోతావా? అని బెదిరించాడని తెలిపింది. తన వద్ద ఉన్న బంగారు గొలుసు, ఫోన్ ఇచ్చేయమన్నాడని, అందుకు తాను నిరాకరించటంతో దాడి చేశాడని, తనను కింద పడేశాడని ఆమె పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more