ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఓ బ్యాంక్ లోన్ మోసం కేసులో అమెరికాలోని వెయ్యి ఎకరాలకుపైగా భూమిని అటాచ్ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా అమెరికాలోని భూమిని స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. అమెరికాలోని కాలిఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్ని అహ్మదాబాద్కు చెందిన ఈడి అధికారులు జప్తు చేశారు. జూమ్ డెవలపర్స్, దాని ప్రమోటర్ విజయ్ చౌధరి 2,200 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి మోసానికి పాల్పడిన కేసులో ఈడి ఈ చర్యకు దిగింది. విజయ్ చౌధరి ప్రస్తుతం పరారీలో ఉండగా, ఐరోపా దేశాల్లోని ప్రాజెక్టుల కోసం రుణం ద్వారా ఈ 2,200 కోట్ల రూపాయలను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులేవీ మొదలవకపోగా, నిధులు పక్కదారి పట్టాయి. ఇదిలావుంటే జప్తు చేసిన 1,280 ఎకరాల స్థలం మార్కెట్ విలువ 1,000 కోట్ల రూపాయల మేర ఉంటుంది. అమెరికాలో ఈడికి ఇది తొలి అటాచ్మెంట్ అని రికార్డులు చెబుతున్నాయి
ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1,280 ఎకరాల స్థలం ఈ స్థలం బ్యాంకు రుణ మోసం కేసులతో సంబంధం ఉన్న జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని ప్రమోటర్ విజయ్ చౌధురికి సంబంధించింద. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ స్థలాన్ని జప్తు చేసినట్టు చెప్పారు.విజయ్ చౌధురి పరారీలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్ శరద్ కబ్రా మాత్రం ఇండోర్ ఇడి అధికారులకు చిక్కాడు. ఈ కేసులో రుణాలిచ్చిన బ్యాంకు పాత్రపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలున్న దుబాయ్ వ్యాపార వేత్త మనీష్ షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈయనను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ముందు హాజరు పర్చారు. గుజరాత్ కేంద్రంగా హవాలా దందా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి షాకు 700 కోట్ల రూపాయలు అందినట్టు ఈడి ఆరోపిస్తోంది. 5,395 కోట్ల రూపాయలకు పైగా హవాలా రాకెట్ను నిర్వహిస్తున్న అఫ్రోజ్, మదన్లాల్ జైన్ల నుంచి ఈ సొమ్ము వచ్చినట్టు చెబుతున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more