అవును.. నిజమే బాత్ రూంలో బంగారం దొరికింది అది కూడా కొంచెం కాదు ఏకంగా నాలుగు కేజీల బంగారం. ఆశ్చర్యపోయారా..? కానీ ఇది నిజం. భూములను తవ్వితే ఖనిజమో ఏదో విలువైన వస్తువులో వస్తాయని విన్నాం కానీ బాత్ రూమ్ తవ్వితే ఏమొస్తుంది అంటే అందరు చెప్పే సమాధానం ముందు కంపు కొడుతుంది తర్వాత ఛండాలం వస్తుంది అని సమాధానం. కానీ అదే బాత్ రూంలో బంగారం దొరికితే ఎలా ఉంటుందో చెప్పండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నాలుగు కేజీల బంగారం దొరకడంతొ అధికారులు కూడా నోరెళ్లబెట్టారట. మస్కట్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న విమానంలోని బాత్రూంలో నాలుగు కేజీల బంగారాన్ని విమాన సిబ్బంది గమనించి... అనంతరం డీఆర్ఐ అధికారులకు వారు సమాచారం అందించారు. డీఆర్ఐ అధికారులు బాత్రూంలోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనిఖీల్లో బంగారం పట్టుబడుతుందని భావించిన ప్రయాణికుడు భయపడి బాత్రూంలో వదిలేసి వెళ్లి ఉంటాడని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు.
చాలా కాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బంగారు గనిలా మారింది. అధికారులు సెర్చ్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత బంగారం దొరకడం మామూలైపోయింది. అధికారులు బంగారు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఎంతలా చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. తాజాగా మరోసారి నాలుగు కేజీల బంగారం దొరకడంతో పోలీసులు శరా మామూలులాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 26వ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా... బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సహకరిస్తున్న ఇద్దరు జీఎమ్ఆర్ ఉద్యోగుల పేర్లు వెళ్లడించాడు. దాంతో వారిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు కూడా. అయితే శంషాబాద్ దొంగ బంగారానికి అడ్డాగా మారింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more