ఎన్నికలలో తన పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో పోటీ అయితే చేశాడు. కానీ గెలుపోటములు దైవాదీనం అనుకున్నాడు. సరిగ్గా ఈ నెల 23న ఎన్నికల ఫలితాల అనంతరం తాను గెలిచానన్న వార్త విని అతనికి అతనే షాక్ కు గురయ్యాడు. అనంతరం కొలుకున్న ఆయన తాను ఓడించిన వ్యక్తి ఎవరనేది తెలుసుకుని మరింత విజయానందం పోందాడు. పీడీపీ పార్టీ తరపున పోటీచేసి సోనావార్ స్థానం నుంచి తాను గెలిచాడు. తన సమీప ప్రత్యర్థి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాను నాలుగు వేల ఓట్లతో ఓడించడంతో మహమ్మద్ అష్రఫ్ మీర్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
పీడీపీ తరఫున పోటీచేసి.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను సోనావార్ స్థానం నుంచి ఓడించిన అష్రఫ్ మీర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన విజయ సంబరాల్లో ఏకంగా ఏకే 47 తుపాకి తీసుకుని.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన ఇంటి ఎదుట మద్దతుదారులు గుమిగూడి.. మీర్ను అభినందించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమర్ అబ్దుల్లాను 4వేల ఓట్ల తేడాతో ఓడించడంతో కాశ్మీర్లో ఇప్పుడు ఆయనను అంతా జెయింట్ కిల్లర్ అంటున్నారు.
తాను గెలిచి తీరుతానన్న నమ్మకం ముందునుంచి తనకుందని, ఒమర్ అబ్దుల్లా తన శక్తి మేరకు ప్రయత్నిస్తే.. తాను తన శక్తి మేరకు ప్రయత్నించానని గెలిచిన తర్వాత అష్రఫ్ మీర్ చెప్పారు. 15 ఏళ్లుగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రాజ్యమేలుతున్నా.. తాము గెలిచి చూపించామని అన్నారు.తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆయన కాల్పులు జరిపిన ఏకే 47 తుపాకి ఆయనదేనా, లేక భద్రతా సిబ్బందిదా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. గెలుపు ఊపులో గాలిలోకి కాల్పులు జరిపి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన అష్రప్ మీర్.. ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాల్పులకు తాను వాడిన తుపాకీ భద్రతా సిబ్బందిదేనన్న వార్తలు వస్తుండడంలో ఆయన ఇబ్బందులను ఎదుర్కోననున్నారు.
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. పీడీపీ నేత మహమ్మద్ అష్రాఫ్ మిర్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు సవాలు విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, వార్తల్లోకి ఎక్కడంతో ఒమర్ ఈ విధంగా స్పందించారు. ఏకే47తో గాల్లోకి కాల్చిన ఘటనపై పోలీసులు దమ్ముంటే మిర్పై కేసు నమోదు చేయాలని అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more