ఒకరోజు నాయకులు మొత్తం కలిసి ఒక బస్సులో ప్రచారం చేయడానికి బయలుదేరుతారు.
అనుకోకుండా వాళ్ల బస్సు రోడ్డు నుంచి తప్పి.. వ్యవసాయ పొలంలో వున్న ఒక చెట్టుకు ఢీ కొట్టుకుంటుంది.
అదే సమయంలో ఆ పొలం యజమాని అయిన రాము అక్కడికి చేరుకుంటాడు.
అక్కడ జరిగిన విషాదాన్ని చూసి అతను వెంటనే ఒక గొయ్యిని తొయ్యడం మొదలుపెడతాడు.
గొయ్యి మొత్తం తోసి.. యాక్సిడెంట్ అయిన నాయకులందరినీ అందులో పాతేస్తాడు.
ఇలా కొద్దిరోజుల తరువాత రాజకీయ నాయకుల బస్సు యాక్సిడెంట్ అయిన విషయం పోలీసులకు తెలుస్తుంది.
వెంటనే వారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బస్సు యాక్సిడెంట్ అయిన చోటుకు చేరుకుంటారు.
అక్కడే వున్న రామును పోలీసులు కొన్ని ప్రశ్నలు వేస్తారు.
పోలీసులు : యాక్సిడెంట్ అయిన తరువాత బస్సులో వుండాల్సిన రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు? నువ్వేమైనా చూశావా?
రాము : వాళ్లు ఎక్కడికి వెళ్లలేదు సార్. నేనే అందర్నీ ఖననం (పూడ్చడం, సమాధి) చేశాను.
పోలీసులు : రాజకీయ నాయకులు అందరూ ఒకేసారి చనిపోయారా?
రాము : లేదు సార్.. కొంతమంది ‘‘మేము చనిపోలేదు. మమ్మల్ని ఎవరైనా కాపాడండి’’ అని చెప్పారు. కానీ రాజకీయ నాయకులు ఎంత అబద్ధం చెబుతారో మీకు తెలుసా కదా సార్! అందుకే వాళ్లు చనిపోయినా.. చనిపోలేదు అని చెప్పుకున్నారు. నేను పూడ్చేశాను.
పోలీసులు షాక్స్... రాము రాక్స్!