వరల్డ్ కప్ హీరోలలో ఒకరిగా నిలచిన డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. యూవీ తాజా పర్యటనలకు ఫిట్ గా వున్నాడని అధికారికంగా దృవీకరించబడింది. అదెలా అంటారా.. కొత్తగా ప్రవేశపెట్టిన యో యో టెస్టును యువరాజ్ సింగ్ ఎట్టకేలకు పాసయ్యాడు. భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఆటగాళ్లు యో యో పరీక్ష తప్పనిసరిగా పాసవ్వాలి. త్వరలో బీసీసీఐ శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను ప్రకటించనున్న నేపథ్యంలో యూవీ ఈ టెస్టు పాసయ్యాడు.
గతంలో మూడు సార్లు యో యో టెస్టుకు హాజరైన యువీ అర్హత మార్కు 16.1ని అందుకోలేకపోవడంతో ఆయన వల్ల అవుతుందా..? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ టెస్టును రెట్టించిన ఉత్సాహంతో జయించి.. తాను ఇక పర్యటనలకు సిద్దం అని బిసిసిఐ సెలక్టర్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. తాజాగా మరోసారి టెస్టుకు హాజరైన అతడు 16.3 మార్కును అందుకున్నట్లు సమాచారం. యువీతో పాటు యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ రానా కూడా యోయో టెస్టులో విజయం సాధించారు.
‘నేను ఫెయిలవుతున్నాను అని అనుకుంటూ కూర్చుంటే ఫెయిలవుతూనే ఉంటాం. యో యో టెస్టులో ఇప్పటికి నేను మూడు సార్లు ఫెయిలయ్యాను. తాజాగా మరోసారి ఆ పరీక్షకు హాజరుకాగా విజయం సాధించాను. ఒక ఫెయిల్యూర్ ను ఎప్పుడైతే మనం అధిగమిస్తామో అప్పుడు మనం విజయానికి ఒక మెట్టు పైకి ఎక్కినట్లే. అది జీవితంలో అయినా సరే.. వ్యక్తిగతంగా అయినా సరే. అపజయాలే మనల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. మరో లెవల్కు తీసుకెళ్తాయని యువరాజ్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more