టీమిండియాలో ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే.. కెప్టెన్ విరాట్ కోహ్లీల మద్య రాజుకున్న వివాదం నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ లో దాయాధి పాకిస్థాన్ చేతితో విరాట్ సేన ఘర పరాజయాన్ని చవిచూసింది. ఈ తరుణంలో గాలివానగా రేగిన వివాదం.. తుఫానులా మారి.. ఏకంగా కోచ్ పదవికి అనీల్ కుంబ్లే రాజీనామా చేసి తప్పుకునేంత వరకు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా అటగాళ్లు.. విరాట్ కోహ్లీకి అండగా నిలువగా, సీనియర్ క్రికెటర్లు మాత్రం అనీల్ కుంబ్లేకు బాసటగా నిలుస్తున్నారు.
కొందరు సీనియర్లు విరాట్ సేనపై విమర్శలకు కూడా దిగుతున్నారు. ప్రధాన కోచ్ అంటే మీరు చెప్పినదానికల్లా తానా అంటే తందానా అనాలా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించి, తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకి పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. 2019 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా క్రికెట్ అభిమానులు ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. గెలుపోటములు సహజం కానీ.. జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరడం.. జట్టు సభ్యులలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదనలు కూడా వినపిస్తున్నాయి.
టీమిండియాను సమర్థవంతంగా నడిపించేంత శక్తిసామర్థ్యాలు కోహ్లీకి లేవని అభిమానులు అక్షేపిస్తున్నారు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్, టీ20 ప్రపంచ కప్ గెలిచింది. ఎంతో విజయవంతమైన కెప్టెన్గా పేరున్న ధోనీని తిరిగి టీమిండియా కెప్టెన్ చేయాలన్న డిమాండ్ కు మద్దుతు పెరుగుతోంది. విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ మధ్యలో ధోనిని సలహాలు, సూచలను అడుగుతుండటం కనిపించడంతో.. ఇక ఆయనకే మరోమారు కెప్టెన్సీ పగ్గాలను అందించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇప్పటికే 35 సంవత్సరాల వయసులో కెరీర్ లో ధీటుగా రాణిస్తున్న ధోనికి కెప్టెన్సీ పగ్గాలను అందించి.. విరాట్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. కోచ్ కుంబ్లే.. కోహ్లీ మధ్య నెలకొన్న విభేదాలే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ పై పరాజయానికి కారణమని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు ధోనీ సారథిగా ఉన్న సమయంలో జట్టులో మంచి వాతావరణం ఉండేది. కోచ్లతో కూడా ధోనీ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కోహ్లీ కంటే ధోనీనే మెరుగైన సారథని అభిప్రాయపడుతున్నారు. దయచేసి ధోనీని కెప్టెన్గా నియమించండి అని వరుస ట్వీట్లతో అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more