టీమిండియా ప్రధాన కోచ్ గా అనీల్ కుంబ్లే తన సత్తాను చాటాడు. వరుసగా ఐదు దేశాలతో టీమిండియా టెస్టు సిరీస్ లను కైవసం చేసుకోవడమంటే అంత సులువు కాదు. కానీ దానిని చేసి చూపించిన జట్టుకు వెన్నుదన్నుగా నిలచి మెలకువలను నేర్పించాడు. టీమిండియా క్రికెటర్లందరి సహనానికి పరీక్ష్ పెట్టాడు. అయితే ఇంగ్లాండ్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో అనీల్ కుంబ్లే పదవీ కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో మళ్లీ ఆయన సేవలను పోడగిస్తారని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే అందుకు భిన్నంగా బీసిసిఐ వ్యవహరించింది.
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అన్వేషణ ప్రారంభించింది. ఈ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా వ్యవహరించాలనుకునే అసక్తిగల ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునంటూ ప్రకటన ఇచ్చింది.'పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కు కోసం ఆప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు'అని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.
కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో... ఆ తరువాత టీమిండియా ప్రధాన కోచ్ గా మరోకరికి బాధ్యతలను అప్పజెప్పాలనం బిసిసిఐ యోచిస్తుంది. ఈ క్రమంలో కుంబ్లేను టీమిండియా డైరెక్టర్ గా నియమించాలని చూస్తోంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య సలహాదారు కమిటీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందని చెప్పింది. నిబంధనల ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే మాత్రం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయనకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more