భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహమ్మద్ షాహిద్(56) కన్నుమూశాడు. గత కొంతకాలం నుంచి కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న షాహిద్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ కీలక ఆటగాడు. జూన్ 29న ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బెనారస్ హిందూ వర్సిటీలోని ఎస్ఎస్ఎల్ హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుర్గావ్ లోని మెడంటా మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నేడు షాహిద్ మృతిచెందారు. ఆయనకు భార్య ప్రవీన్ షాహిద్, ఇద్దరు సంతానం మహమ్మద్ సైఫ్, హీనా షాహిద్ ఉన్నారు.
1960 ఏప్రిల్ 14న యూపీలోని వారణాసిలో జన్మించిన షాహిద్.. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్(అండర్-19) లో ఫ్రాన్స్ పై చెలరేగి ఆడి విజయాన్ని అందించాడు. అక్కడి నుంచి అతని విజయ ప్రస్థానం రిటైరయ్యే వరకూ సాగింది. 1985-86 సీజన్లో హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడటంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించేవాడు. దూకుడుతో కూడిన వేగమే మంత్రంగా అతడు మైదానంలో చురగ్గా కదులుతూ తన ఆటతీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునేవారు. 1980 ఒలింపిక్ స్వర్ణం ఇచ్చిన ఉత్సాహంతోనే టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిందని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. అంతటి స్ఫూర్తిని నింపిన దిగ్గజం మృతి హాకీకి తీరని లోటు. షాహిద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1981 లో అర్జున అవార్డు, 1986లో పద్మశ్రీతో సత్కరించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more