వెస్టిండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమైన టీమిండియా ఆటగాళ్లు మరికొద్ది గంటల్లో తొలిటెస్టులో తలపడున్న తరుణంలో కోహ్లీ సేనకు ఇది నిజంగా పరీక్షగా మారింది. ఎందుకంటారా.. ఇన్నాళ్లు ఏ ఫార్మెట్ క్రికెట్ అయినా దూకుడుగా అటను ప్రదర్శించిన టీమీండియా నుంచి బోరింగ్ క్రికెట్ కావాలని అడుతున్నారట ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే. ఇందుకు అవసరమైతే ఆటగాళ్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని బ్యాట్స్మన్లకు ఆయన సూచించాడు. అయితే దీని వెనుకు కూడా కారణాలు వున్నాయి. అవేంటంటే..
ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్ మెండ్ సెట్ తో ఉన్నారని, అయితే ప్రస్తుతం జరగబోయేవి టెస్టులని అందుకు తగ్గట్లుగా మలుచుకోవాలని పేర్కొన్నాడు. దాదాపు రెండు నెలలు ఐపీఎల్ తో బిజీగా ఉన్న ఆటగాళ్లు ఆ తర్వాత కేవలం జింబాబ్వేతో మాత్రమే మ్యాచ్ లు ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలకు టెస్టులు నిజంగానే టెస్ట్ పె డతాయంటూ చమత్కరించాడు. గురువారం విండీస్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కుంబ్లే ఆటగాళ్లకు విలువైన సూచనలు, సలహాలిచ్చాడు.
విండీస్ స్లో పిచ్ లపై రాణించాలని పేసర్లు, స్పిన్నర్లకు కోచ్ కుంబ్లే నిర్దేశించాడు. పరుగులు చేసేటప్పుడు బ్యాట్స్మన్లు భాగస్వామ్యాలు నెలకొల్పిన తరహాలోనే బౌలర్లు జంటగా రాణించాలన్నాడు. అయితే సిరీస్ నెగ్గాలంటే కచ్చితంగా స్పిన్నర్లే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ లోయర్ ఆర్డర్ లో రాణిస్తే భారత్ కు కలిసొస్తుంది. బ్యాట్స్మన్లు మాత్రమే కాదు బౌలర్లు పరుగుల కోసం యత్నించాలని అప్పుడే విజయావకాశాలు మెరుగు పడతాయని కోచ్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more