అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచ కప్ 2015 సెషన్ లో అనుసరిస్తున్న ఫార్మాట్ పై భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ను మండిపడ్డారు. ఫార్మట్ చప్పగా వుందంటూ ఇద్దరూ వ్యాఖ్యానించారు. మొత్తం 14 జట్టు పోటీపడే ఈ టోర్నీలో గ్రూప్ దశలో అమీతూమీకి పెద్దగా అవకాశాలు లేవంటున్నారు. 14 జట్లలో అగ్రశ్రేణి జట్లు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరుకుంటాయని, మిగిలిన జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అయా గ్రూపులలోని జట్టు ఏవేవి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటాయో ముందుగానే క్రికెట్ అభిమానులు ఊహించుకోగలుగుతున్నారని అన్నారు.
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో అనుబంధ జట్లను కూడా పాల్గొనేలా చేయడం వల్ల ప్రపంచకప్ పై అసక్తి తగ్గేలా చేస్తోందన్నారు. లీగ్ దశలో పోటీ తీవ్రత తగ్గడంతో ఆటపై ఆసక్తి తగ్గుతుందని పెదవి విరిచారు. ప్రపంచ కఫ్ ను కేవలం అగ్రశేణి పది జట్ల మద్య నిర్వహించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఐసీసీ జారీ చేసే ర్యాకింగ్ ల ఆధారంగా తొలి ఎనమిది జట్లు అటోమెటిక్ గా క్వాలిఫై కావాలని, చివరి రెండు స్థానాల కోసం.. ప్రపంచ క్రికెట్ కప్ కు ఓ ఏడాది ముందు మిగిలిన జట్ల మధ్య పోలీని నిర్వహించాలని వారు సూచించారు.
అయితే లీగ్ దశలో అడటం పసికూనలుగా భావిస్తున్న అఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ వంటి పలు జట్లకు కూడా లాభిస్తుందని చెప్పారు. అగ్రశ్రేణి జట్లను ఓడించ గలిగితే పసికూనలు కూడా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు వుంటాయని గవాస్కర్ విశ్లేషించాడు. ష్పీన్నర్లపై ఆధారపడే టీమిండియా జట్టు వరల్డ్ కప్ ను మరో పర్యాయం నిలబెట్టకోవాలంటే కొంత అధికంగానే చమడోల్చాల్సిన అవసరముందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more