‘‘నీవు పది మందికి ఉపయోగపడలంటే.. నిజాయితీగా ఆలోచించు..
నీవు ఒక్కడివే బాగుపడాలంటే.... నీవు స్వార్థంగా ఆలోచించు ’’
ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్పాను అంటే.. జూన్ 30 వరకు అసలు నీవు ఎవరో, ఎక్కడుంటావో, ఏం చేస్తావో, తెలుగు ప్రజలకు తెలియదు. జూన్ 30న కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రం పై ఒక ప్రకటన చేసింది. ఆ విభజన తరువాతనే .. ఏపీ ఎన్జీవోల నాయకుడిగా తెరపైకి వచ్చావు. సమైక్యాంద్ర కోసం పోరాడుతున్న నాయకుడిగా, సమైక్యాంద్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నావు. ఇంత వరకు బాగానే ఉంది. సమైక్యాంద్ర ఉద్యమం హీట్ పెరుగుతున్న కొద్ది నీవు స్వార్థంగా ఆలోచిస్తున్నావు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి అశోక్ బాబు. నిన్నటి వరకు నిజాయితీ, నీతి తప్పకుండా, ఉద్యమం నడుపుతున్న నీలాంటి నాయకుడు పై ఈ నిందలు ఏమిటి? ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు లేని ఉద్యమంగా రూపుదిద్దుకున్న సమైక్యాంద్ర ఉద్యమం పై ఇలాంటి కామెంట్స్ రావటంతో.. తెలుగు ప్రజలు మనోవేదను గురవుతున్నారు. అసలు ఎందుకోసం సమైక్యాంద్ర ఉద్యమం పుట్టింది? సీమాంద్ర ప్రజలు ఉద్యమంలో ఎందుకు పాల్గోంటున్నారు? సీమాంద్ర ఉద్యోగులు అంత నీ వెనక ఎందుకు ఉన్నారు? ఒకే ఒక్కసారి ఆలోచించు అశోక్ బాబు? అసలు సమైక్యాంద్ర ఉద్యమం తీరు, లక్ష్యం, ఒక్కటే. ఆంద్రప్రదేశ్ రెండుగా విడిపోకుండా, తెలుగు జాతి రెండుగా విడిపోకుండా, సమైక్యంగా ఉండాలనే సంకల్పంతోనే 13 జిల్లాల ప్రజలు, ఉద్యోగులు, సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండటమే సమైక్యవాదుల లక్ష్యం. అయితే ఇక్కడ ఉద్యమ తీరు మారుతుంది. రాను రాను.. మీలో ఒక రాజకీయ నాయకుడిలో కలిగే ఆలోచనలు వస్తున్నాయి. మీరు మాట్లాడ్లే ప్రతి మాట వెనుక 13 జిల్లాల ప్రజల మనోభావాలు ఉన్నయానే విషయం మీరు మరిచిపోతున్నారు. అంటే మీకు మాట్లాడే విధానం రాదని కాదు. సేవ్ ఆంద్ర సభ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయిన ‘‘సత్యవాణి ’’ గురించి ఢిల్లీ పెద్దల వరకు వెళ్లింది. అంటే సత్యవాణి మాట్లాడిన ప్రతి మాట ఒక పదునైన బాణంతో శత్రువుల మనుసును తాకింది. సత్యవాణి మాట్లాడిన సభలో ఏ రాజకీయ పార్టీని ,ఏ రాజకీయ నాయకుడి పై విమర్శలు చెయ్యలేదు. కానీ జరుగుతున్న విధానాలను.. సత్యవాణి కళ్లకు కట్టినట్లు సభలో వివరించటం జరిగింది. అంతేతప్ప.. ఆమెకు ఎవరు రాజకీయ శత్రువులు లేరు. ఒక ప్రజా వ్యక్తిగా సమైక్యాంద్ర కోసం సత్యవాణి సభలో మాట్లాడటం జరిగింది. ఈ విషయం ఎందుకు అంటే.. ‘‘ దారిలో ఏనుగు పోతుంటే.. వీది కుక్కలు మొరుగుతుంటాయి’. ఆ ఏనుగు వాటి అరుపులు విని ఆగిపోతే .. తన గమ్యం చేరుకోలేదు. మీరు స్వచ్చమైన ఉద్యమం చేస్తున్నప్పుడు.. అనేక మంది అనేక రకాలుగా కామెంట్స్ చేస్తారు. వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. నీవు స్వార్థ రాజకీయల కోసమో, రాజకీయ పదవులు కోసమో ఉద్యమం చెయ్యటం లేదు. తెలుగు ప్రజలు ఒక్కటిగా కలిసి ఉండాలనే సంకల్పంతోనే ఉద్యమం చేస్తున్నారు.
అలాంటి అశోక్ బాబు పై రాజకీయ నాయకులు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? అశోక్ బాబు కొన్ని విషయాలు తెలుసుకోవాలి? మీ సభలు, ప్రజలు నిర్వహిస్తున్నారు. మీరుసభలో మాట్లాడేటప్పుడు.. రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను, ఆయా ప్రాంత నాయకులను టార్గెట్ చేసి మాట్లాడకండి? రాజకీయ నాయకులు వారి రాజకీయ జీవితం గురించి మాట్లాడకండి? మీరు మాటకు ముందు ఒకసారి, మాటకు వెనుక ఒకసారి , సీమాంద్ర నాయకులు, సీమాంద్ర మంత్రులు రాజీనామా చెయ్యాలని, ప్రజా వేదిక మీద చెప్పకండి? సమైక్యాంద్ర ఉద్యమంలోకి రాజకీయ నాయకులు వస్తే ఎంత? రాకపోతే ఎంత? ప్రజల మద్య నుండి పుట్టిన వాడే ప్రజా నాయకుడవుతాడు? అలాంటి నాయుకుడినే ప్రజలు ఎన్నుకుంటారు. ‘‘ తెలుగు తల్లి రుణం తీర్చుకోవటానికి.. తన తల్లి పాలు తాగినవాడు ఎవడైన సమైక్యాంద్ర ఉద్యమంలో పాల్గొంటారు’’. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతాడు. ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదనే విషయం అశోక్ బాబు తెలుసుకోవాలి. సమైక్యాంద్ర ఉద్యమం స్వచ్చమైన ఉద్యమని చెప్పటానికి నువ్వు ఆదర్శం కావాలి.... అని సీమాంద్ర ప్రజలు కోరుకుంటున్నారు. ‘‘ సింహం వేటాడేటప్పుడు.. ఎవరైన కదిలిస్తే.. ఏం జరగుతుంది? సింహం విసిరే పంజా దెబ్బకు రుచి చూడాల్సి వస్తుందనే విషయం ’’ సీమాంద్ర ఉద్యమం పై కామెంట్స్ చేసే రాజకీయ నాయకులకు తెలియాలాని సీమాంద్ర ప్రజలు అశోక్ బాబు ను కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more