లేట్నైట్ పార్టీలు, పబ్ కల్చర్ నేటి యువతలో మితిమీరుతోంది. పాశ్చాత సంస్కృతి మోజులో పీకల వరకు మద్యం తాగి.. రాత్రిళ్లు ఆహారాన్ని తీసుకుంటూ.. అది జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు. ఇలా లేట్ నైట్ పార్టీలు కొందరి యువత ప్రాణాలపైకి కూడా తెచ్చుకుంటున్నారు. అరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్తో చిల్ అవ్వాల్సిందే అనేలా ప్రవర్తిస్తున్నారు. సాప్ట్ వేర రంగంలో ఈ ధోరణి అధికంగా కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు కేవలం సెలబ్రిటీలు, సినీతారలు, ఇత్యాధులకు మాత్రమే పరిమితమైయ్యాయి.
ఈ మధ్యాకాలంలో ఈ లేట్ నైట్ పార్టీలు సాప్ట్ వేర్ ఉద్యోగులతో హద్దులు మీరుతోంది. ఉన్నత వేతనవర్గాలు రాత్రిళ్లంతా వీరు పబ్ లల్లో చిందేస్తున్నారు. ఇక వారి తరువాతి వేతన వర్గాలు బార్లలో చిందులేస్తున్నారు. ఇది చాలదన్నట్లు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు అప్పడప్పుడూ పార్టీలను ఇచ్చి.. వారి సేవలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ఇక తాజా విషయానికి వస్తే ఇలాంటి పబ్ పార్టీలు మన బాలీవుడ్ నటీనటులకు కొత్తేమీ కాదు. బాలీవుడ్ నటి, సింగర్ గరిమా జైన్కు ముంబైలోని పబ్లో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం ఏప్రిల్2న వీకెండ్ పార్టీ కోసం ముంబై ఎయిర్పోర్ట్కు దగ్గర్లో ఉన్న పబ్కు వెళ్లిన గరిమా పార్టీలో బాగా ఎంజాయ్ చేసింది.
తెల్లవారుజామున 3.15నిమిషాలకు అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో తన ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించింది. వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పబ్కి వెళ్లి ఎంత దొరికినా తన ఫోన్ కనిపించలేదంటూ వాపోయింది. ఆ ఫోన్ ధర సుమారు లక్ష రూపాయల దాకా ఉంటుందని పేర్కొంది. గరిమా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గరిమా ఇటీవలే రాణి ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన మర్దాని 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more