హీరోయిన్ స్వాతి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘త్రిపుర’. జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ – “ఈ నెల 15న ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభించాం. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ఒకటి స్వాతి ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటను తమిళనాడులోని కుట్రామ్ లో, మరో పాటను పొల్లాచ్చి, కొడైకెనాల్ లోనూ చిత్రీకరించనున్నాం” అని చెప్పారు.
చిత్రవిశేషాలు చెబుతూ – “ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. స్వాతి అత్యద్భుతంగా నటిస్తోంది. త్రిపుర పాత్రను తను తప్ప ఎవరూ చేయలేరేమో అన్నంతగా నటిస్తోంది. మరో పాత్రను పూజా రామచంద్రన్ చేస్తోంది. తను కూడా బాగా యాక్ట్ చేస్తోంది. రాజ కిరణ్ అద్భుతమైన కథ రాశారు. ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, స్వాతి నటన, రాజ కిరణ్ టేకింగ్, ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. కథ డిమాండ్ మేరకు రాజీపడకుండా ఖర్చు పెట్టి తీస్తున్నాం” అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ – “బలమైన కథతో ఈ చిత్రం చేస్తున్నాం. త్రిపుర ఏం చేస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది” అని చెప్పారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more