ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఈ సంక్రాంతి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈయన నిర్మించిన ‘ఎవడు ’ సినిమా లేట్ గా విడుదల అయినా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. గత నాలుగు రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు అదరగొడుతుండటంతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ ఆనందాన్ని పురస్కరించుకొని దిల్ రాజు ‘ఎవడు ’ విజయ యాత్రను చేపట్టబోతున్నాడు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రకటిస్తూ... ఈ నెల 17వ తేదీ నుండి అనగా రేపటి నుండి ఈ విజయ యాత్ర తిరుపతి నుండి ప్రారంభం అవుతుందని, ఈ యాత్రలో ‘ఎవడు ’ టీం మొత్తం పాలు పంచుకోబోతుందని తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరులలో 17వ తేదీన, విజయవాడ, భీమవరం, పాలకొల్లు రాజమండ్రిలలో 18వ తేదీన సాగుతుందన్నారు.
వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఈ విజయం దక్కిందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కొంత మంది రామ్ చరణ్ అభిమానులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఈ యాత్రను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more