stock markets trade in green for consecutive second day

From tokyo with love sensex surges 402 pts nifty ends at 7819

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

A spectacular surge in Tokyo lifted sentiment across Asia and India was no exception. The bulls rallied for the second day running to help indices reclaim crucial levels.

స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండోరోజు లాభాల పంట..

Posted: 09/09/2015 06:43 PM IST
From tokyo with love sensex surges 402 pts nifty ends at 7819

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా జపాన్ లోని టోక్యో మార్కెట్ నుంచి వచ్చిన పవనాలు ఆసియా మార్కెట్లను లాభాలతో ముంచెత్తాయి. అందుకు భారతీయ మార్కెట్ ఏ మాత్రం మినహాయింపు లేకుండా లాభాలను అదిమిపట్టింది. దీంతో వరుసగా రెండవ రోజు దేశీయ సూచీలు లాభాలలో ముగిసాయి. దీంతో దేశీయ సూచీలు గతంలో కోల్పోయిన లాభాలను తిరిగి సాధించినట్లు అయ్యింది. సెన్సెక్ 1.6 శాతం, నిఫ్టీ 1.7శాతం మేర లాభాలను అధిమి పట్టుకున్నాయి. ఇవాళ సుమారు 1975 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 718 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 108 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.

మార్కట్లలోని అన్ని సూచీలు రమారమి లాభాలను నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాకింగ్, బ్యాకింగ్ నిష్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ గూడ్స్, లోహాం, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన సూచీలు అధికలాభాలను అర్జించగా, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీలకు సంబంధిచిన సూచీలు కూడా లాభాలను గడించాయి. ఉదయం ప్రారంబం నుంచే లాభాల బాటలో పయనిస్తున్నా సూచీలు సాయంత్రానికి లాభాలతోనే ముగిశాయి.
 
ఈ క్రమంలో మార్కెట్ ముగిసే సమాయానికి సెన్సెక్ 402 పాయింట్ల లాభాన్ని అర్జించి.. 25 వేల 720 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 130 పాయింట్ల లాభాన్ని ఆర్జించి 7 819 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎండీసీ, హిండాల్కో, వేదాంత, ఎన్ టీ పీ సీ, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మ, గెయిల్, విప్రో, బిపిసీఎల్ సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles