గోల్కొండ కోట పరిధిలోని రాజప్రసాదం, ఉన్నతాధికారులు, సహాయక సిబ్బంది, కోటలో నివాసం ఉండేవారికి స్థానికంగా ఉన్న బావుల్లోని నీరు సరిపోయేది కాదు. కుత్బ్షాహీ పాలకుల ఆదేశంతో అప్పటి ఇంజినీర్లు చుట్టుపక్కల నీటి వనరుల్ని అన్వేషించారు. రహస్య చెరువుగా పేరొందిన దుర్గం చెరువును గుర్తించారు. కొండల నుంచి వచ్చే నీరు చిన్న కట్టతో అక్కడి నిలుస్తుండగా..దాన్ని అభివృద్ధి చేశారు. దక్షిణం వైపున్న కట్ట ఎత్తు పెంచడంతోపాటు..ఎక్కువ నీరు నిల్వచేసినా తట్టుకునేలా దృఢంగా మార్చారు. నీటి విడుదల, నియంత్రణకు తూములు ఏర్పాటుచేశారు. చెరువు నుంచి కోట వరకు కాలువ తవ్వి నీటి సరఫరాకు మార్గం సుగమం చేశారు.
భూగర్భంలో.. ఆ తర్వాత 15, 20 అడుగుల ఎత్తులో: ఇందులో భాగంగా దుర్గం చెరువు తూముల నుంచి కొంతదూరం వరకు భూగర్భ మార్గంలో నీటిని మళ్లించారు. ఖాజాగూడ ప్రాంతంలో నెహర్ నాలాను పైకి లేపారు. స్తంభాలపై వెడల్పయిన గోడలు నిర్మించి, వాటి మధ్య కాలువలో నీళ్లు పారేలా చేశారు. ప్రాంతాన్ని బట్టి 5, 10, 20 అడుగుల ఎత్తున వాటిని అనేక ప్రాంతాల్లో నిర్మించారు. దుర్గం చెరువు నుంచి గోల్కొండ కోట వరకు దాదాపు నాలుగు కి.మీ. దూరం ఉన్న ఈ నీటి సరఫరా వ్యవస్థ ‘నెహర్ నాలా’ (నిరంతరం ప్రవహించే కాలువ)గా గుర్తింపు పొందింది.
దాని ద్వారా గోల్కొండ కోటలోని రెండు అంతస్తుల్లోకి నీళ్లు అవలీలగా వెళ్లేవి. రాజప్రసాదాలు, ఉద్యానవనాలు, ఈత కొలనులకు..ఒకటేమిటి కోటలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేది. ఫౌంటెన్లో ఎగిసిపడే నీటి చప్పుడు...కోట కింది మార్గంలో వినపడే ఏర్పాట్లూ జరిగాయి. ‘నేటి ఇంజినీర్లు కూడా ఆశ్చర్యపోయేలా దుర్గంచెరువు నుంచి గోల్కొండ కోటకు నీటిసరఫరా జరిగింది. ప్రస్తుతం ఈ నాలా కాలగర్భంలో కలిసింది. దాని మార్గంలో నివాసాలు ఏర్పాడ్డాయి.
దర్గా ప్రాంతంలో మాత్రమే కొంతమేరకు దాని ఆనవాళ్లున్నాయి. దీని పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో భవిష్యత్తు తరాలకు ఆ ఇంజినీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేసే అవకాశం లేకుండా పోతుంది.’ అని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, విశ్రాంత పురావస్తు అధికారి ఖయ్యూం పేర్కొన్నారు. సుమారు నాలుగొందల ఏళ్ల క్రితమే గురుత్వాకర్షణ(గ్రావిటీ) శక్తితో ఇళ్లకు నీటి సరఫరా జరిగింది.
కోటలు, రాజమందిరాల్లోని రెండుస్తుల వరకు నీళ్లు చేరాయి. ఫౌంటైన్లలో నీళ్లు ఉవ్వెత్తున ఎగిశాయి. అంతెందుకు చార్మినార్ పైఅంతస్తు వరకు నీళ్లు వెళ్లేవి. గండిపేట, హిమాయత్సాగర్ నుంచి 18 కి.మీ దూరం గ్రావిటీతో నీరు సరఫరా అయింది. ఇప్పటితరం నమ్మలేని నిజమిది. అప్పటి ఇంజినీరింగ్ అద్భుతానికి తార్కాణమిది. దుర్గం చెరువు నుంచి గోల్కొండ కోట వరకు విస్తరించిన ‘నెహర్ నాలా’ అలాంటి అబ్బురాల్లో ఒకటి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more